Breaking: గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. సభలోకి నల్ల కండువాలు కప్పుకొని వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశారు. 

New Update
Breaking: గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అసెంబ్లీ చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు కప్పుకొని వచ్చారు. ఇక గవ­ర్నర్‌ ప్రసంగం అనంతరం స్పీకర్‌ అధ్యక్షతన శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశం జరగనుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై ఈ భేటీలో స్పష్టత రానుంది. మూడు నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను రాష్ట్ర సర్కార్‌ ప్రవేశపెట్టనుంది. అలాగే మూడు శ్వేతపత్రాలను ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు టీడీఎల్పీ భేటీ జరగనుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఈనెల 26 వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది.

Also Read : అసలు నీ భర్త ఎవరు?: శాంతికి సర్కార్ నోటీసులు




Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Liquor Scam: లిక్కర్ స్కామ్ లో సంచలనం.. మరో ఆడియో విడుదల చేసిన రాజ్ కసిరెడ్డి!

ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై రాజ్ కసిరెడ్డి మరోసారి స్పందించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిట్‌ ఆఫీసుకు విచారణకు వస్తానని ప్రకటించారు. ఈ మేరకు సిట్ అధికారులకు తన తండ్రి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఆడియో విడుదల చేశారు.

New Update

ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై రాజ్ కసిరెడ్డి మరోసారి స్పందించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిట్‌ ఆఫీసుకు విచారణకు వస్తానని ప్రకటించారు. ఈ మేరకు సిట్ అధికారులకు తన తండ్రి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఆడియో విడుదల చేశారు. ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో వాదనలకు సమయం పట్టేలా ఉందన్నారు రాజ్ కసిరెడ్డి. అందుకే సిట్‌ విచారణకు హాజరవుతున్నట్లు చెప్పారు. తొలిసారిగా కసిరెడ్డి సిట్ ముందుకు హాజరు అవుతుండడం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆయన సిట్ అధికారులకు ఏం చెబుతారు? ఎవరి పేర్లు బయట పెడతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

విజయసారి చరిత్ర బయట పెడతా..

ఏపీ లిక్కర్ స్కాం ప్రధాన నిందితుడు కసిరెడ్డి ఈ నెల 19న సైతం ఓ ఆడియో విడుదల చేశారు. మార్చిలో సిట్‌ అధికారులు వారి ఇంటికి వచ్చినట్లు చెప్పారు. తాను లేనప్పుడు తన తల్లికి నోటీసులు ఇచ్చారన్నారు. తనను విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు చప్పారు. ఎందుకు పిలుస్తున్నారో క్లూ ఇవ్వమని అడిగానన్నారు. తన ఈ మెయిల్‌కు సెకండ్‌ నోటీసు ఇచ్చారన్నారు. ఈ విషయంపై తాను తన లాయర్లను సంప్రదించానన్నారు. ముందస్తు బెయిల్‌ కోసం కూడా పిటిషన్ వేసినట్లు వివరించారు.

సిట్ కు సహకరిస్తా..

సిట్‌ విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. విజయసాయి తీరు, చరిత్ర, నిజాలు త్వరలో బయటపెడతానన్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్ట్ లో విచారణ జరిగింది. ప్రభుత్వం నుంచి తాము సూచనలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను వారం పాటు వాయిదా వేసింది న్యాయస్థానం. 

(ap liquor scam | telugu-news | telugu breaking news | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment