YS Vijayamma: కొడుకు దగ్గరికి విజయమ్మ.. ఆసక్తికరంగా వైఎస్ ఫ్యామిలీ రాజకీయం!

ఎట్టకేలకు వైఎస్ విజయమ్మ జగన్ చెంతకు చేరింది. ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసి బాధలో కూరుకుపోయిన కొడుకును ఓదార్చేందుకు విదేశాలనుంచి నేరుగా జగన్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె కొన్నిరోజులు జగనే వద్దే ఉండనున్నట్లు సమాచారం.

New Update
YS Vijayamma: కొడుకు దగ్గరికి విజయమ్మ.. ఆసక్తికరంగా వైఎస్ ఫ్యామిలీ రాజకీయం!

Jagan: ఏపీలో వైఎస్ఆర్సీపీ ఓటమితో వైఎస్ ఫ్యామిలీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఘోర ఓటమితో బాధలోవున్న జగన్ ను ఓదార్చేందుకు ఎట్టకేలకు వీదేశాలనుంచి విజయమ్మ ఏపీకి చేరుకుంది. నేరుగా జగన్ నివాసానికి వెళ్లిన విజయమ్మ జగన్ కు అండగా నిలబడి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆమె కొన్నిరోజులు జగనే వద్దే ఉండనున్నట్లు సమాచారం.

గత ఎన్నికల్లో దగ్గరుండి గెలిపించి..
ఇక గత ఎన్నికల్లో దగ్గరుండి జగన్ ను గెలిపించిన విజయమ్మ..ఈసారి ఎన్నికల ముందు అమెరికా వెళ్లిపోయింది. అంతేకాదు తన కూతురు, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిలను గెలిపించండి అంటూ వీడియో రిలీజ్ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది. వైఎస్ ఫ్యామిలీలో అంతర్గత కలహాలు ఉన్నాయని, జగన్ తల్లి, చెల్లిని దూరం పెడుతున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

ప్లీనరీ వేదికగా వైసీపీ నుంచి వైదొలిగి..
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు అందుకు భిన్నంగా వ్యవహరించారు. పార్టీ మహాసభగా భావించే ప్లీనరీ వేదికగానే తాను వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. కేవలం తన పదవికి మాత్రమే కాకుండా పార్టీ సభ్యత్వాన్నే ఆమె వదులుకుంటున్నట్టు వెల్లడించారు. ఇది రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. వైసీపీ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలకు కారణమయ్యింది. ఆమె ప్రకటన చేస్తున్న సమయంలోనే సభలో వద్దు, వద్దు అంటూ వినిపించిన నినాదాలే అందుకు నిదర్శనం.

కూతురుకు మద్ధతుగా..
2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని విజయమ్మవిజ్ఞప్తి చేశారు. 'కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్‌ను అభిమానించే, ప్రేమించే వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. వైఎస్సార్‌ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తోంది. కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి. ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా' అన్నారు. అయితే విజయమ్మ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan : విద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన పరిస్థితిపై విచారణ

పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

New Update
pawan kalyan

pawan kalyan Photograph: (pawan kalyan)

Pawan Kalyan :పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు  పవన్ కళ్యాణ్  ఆదేశించారు. కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు.  పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి అనే దానిపై విచారణ చేయాలని ఆదేశించారు.  సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్ ను ఏమైనా నియంత్రించారా విషయాలను కూడా తెలుసుకోవాలన్నారు.తదితర అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు పవర్‌ కళ్యాణ్‌  ఆదేశాలు జారీ చేశారు.

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

 తన పర్యటనల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఇప్పటికే పవన్ సూచించారు.కూటమి ప్రభుత్వంలో ముఖ్యుల పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ ,హెలికాప్టర్ లో వెళ్ళినా రోడ్డుపై ట్రాఫిక్ నిలవడం, చెట్లు కొట్టడం లాంటివి చేయడం ఆపడం లేదని తెలిపారు.పార్టీ శ్రేణులు, నాయకులకు సైతం క్రేన్ దండలు కార్యక్రమాలు, ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Also read :  Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్‌ లల్లాకు సూర్య తిలకం


కాగా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్ష కి ఆలస్యం అయిందని కొంతమంది విద్యార్థులు ఆరోపించారు. కన్వాయి వల్ల - పెందుర్తి అయాన్ డిజిటల్  JE అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళాల్సి వచ్చిందని వాపోయారు. 30 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష   రాయకుండా వెనిదిరగాల్సి వచ్చింది. దీనివల్ల - పిల్లల భవిష్యత్తు అగమ్య అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

Advertisment
Advertisment
Advertisment