Y S Sharmila: పార్టీ నాయకుడి మృతితో తల్లడిల్లిన షర్మిల.. భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు..

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి చెందిన నాయకుడు అమన్‌ మృతితో షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మేకల కుంట గ్రామంలో పార్టీ యువనేత అమన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల.. అమన్ కుటుంబ సభ్యులను ఓదార్చి, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయం కింద అమన్ కుటుంబానికి షర్మిల 3లక్షలు అందజేశారు.

New Update
Y S Sharmila: పార్టీ నాయకుడి మృతితో తల్లడిల్లిన షర్మిల.. భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు..

Y S Sharmila: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి చెందిన నాయకుడు అమన్‌ మృతితో షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మేకల కుంట గ్రామంలో పార్టీ యువనేత అమన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల.. అమన్ కుటుంబ సభ్యులను ఓదార్చి, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయం కింద అమన్ కుటుంబానికి షర్మిల 3లక్షలు అందజేశారు. తనను ఎంతో అభిమానించే అభిమాని అకాల మృతి చెందడంతో ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటానని షర్మిల హామీ ఇచ్చారు. తన అభిమానినీ చివరి చూపులు చూసేందుకు వెళ్లిన ఆమె కన్నీటి పర్యంతమై ఆ అభిమాని నుదుటిని ముద్దాడారు.

కొనిజర్ల మండలంలోని మేకాలకుంట గ్రామానికి చెందిన పఠాన్ అమన్ ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. అమన్ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ యువజన విభాగం నాయకుడిగా ఉన్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. షర్మిలకు వీరాభిమానిగా ఉంటూ గతంలో షర్మిల పాదయాత్రలో సుమారు 6 నెలల పాటు ఆమెతో పాటే పాదయాత్రలో పాల్గొన్నాడు. అమన్ మృతి చెందాడన్న వార్త తెలిసిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల స్వయంగా వారి స్వగ్రామానికి వెళ్లి అమన్ నుదుటిపై ముద్దు పెట్టి భౌతికకాయంపై పూలమాలవేసి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులను ఓదార్చి.. ధైర్యంగా ఉండాలని అండగా ఉంటానని హామీ ఇచ్చారు నిరుపేద కుటుంబం కావడంతో ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని చెప్పారు. అమన్‌ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని షర్మిల హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తల కోసం చూడండి..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నేడే కేబినెట్ భేటీ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.

New Update
chandrababu

chandrababu

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నారు. సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సీఆర్డీయే కమిషనర్‌కు అనుమతి ఇస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.

updating..

Advertisment
Advertisment
Advertisment