Breaking : పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ రాళ్ల దాడి..!

పల్నాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముప్పాళ్ల మండలం మాధలలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు కార్యకర్తలు. రాళ్ల దాడిలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
Breaking : పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ రాళ్ల దాడి..!

Guntur : పల్నాడు(Palnadu) లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గం రణరంగంగా మారింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana), మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. ముప్పాళ్ల మండలం మాధలలో వైసీపీ(YCP), టీడీపీ(TDP) కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రాళ్ల దాడిలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే బాధితులను సత్తెనపల్లి ఆస్పత్రికి తరలించారు.

Also Read: తాటి ముంజలు కొట్టిన కేఏ పాల్.. రాష్ట్రం అప్పులు తీరాలంటే ఇలా చేయండి..!

దీంతో ఇరుపార్టీల కార్యకర్తలు ఆస్పత్రికి భారీగా చేరుకున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ గాయపడిన వారిని పరామర్శించారు. మరల ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు