WPL 2024: నేడు ముంబై-ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 లో ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. డిఫెండిగ్ చాంఫియన్ ముంబయి ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.  

New Update
WPL 2024: నేడు ముంబై-ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్!

WPL 2024 MI Vs RCB: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 లో ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. డిఫెండిగ్ చాంఫియన్ ముంబయి ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. 

సాయంత్రం జరగబోయే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం చాలా మంది క్రికెట్ అభిమానులు  ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఐపీఎల్ మెన్స్ క్రికెట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధిచంలేదు. కాని ఇప్పుడు ఆరీసీబీ ఫ్యాన్స్ చూపంతా ఆర్సీబీ  మహిళలపైనే ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ను చిత్తు చేసి ఫైనల్ కు చేరుకుని కప్పు సాధించాలని ఆర్సీబీ  అభిమానులు కోరుకుంటున్నారు. గత సీజన్‌లో లీగ్‌ దశకే పరిమితమైన ఆర్సీబీ.. ఈ సీజన్‌లో లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌లో ముంబైని ఓడించి తొలిసారి నాకౌట్‌కు అర్హత సాధించింది. మరోవైపు గత సీజన్‌ విజయపరంపరను కొనసాగిస్తూ.. ముంబై మరోసారి ప్లే ఆఫ్స్‌ చేరింది. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30కు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజేతలుగా నిలిచిన జట్టు  గత రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఫైనల్‌లో ఢీకొడుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు