Murder: కూతురిపై తండ్రి అత్యాచార యత్నం.. భార్య ఏం చేసిందంటే!

తాగిన మైకంలో కూతురిపై అత్యాచార యత్నం చేయబోయిన భర్త మాణయ్యను భార్య ఇందిరమ్మ గొడ్డలితో నరికి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇందిరమ్మను అదుపులోకి తీసుకున్నారు.

New Update
Murder: కూతురిపై తండ్రి అత్యాచార యత్నం.. భార్య ఏం చేసిందంటే!

Sangareddy: మద్యం మత్తులో కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్‌పూర్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగా.. పుల్కల్‌ ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుల్తాన్‌పూర్‌కు చెందిన మన్నె మాణయ్యకు భార్య, ఇద్దరు కూమార్తెలు, కొడుకు ఉన్నారు. మొదటి కూతురు సుకన్యకు పెళ్లి చేయగా ఆమెకు పాప జన్మించింది. భర్తతో విభేదాల కారణంతో ఆమె రెండేళ్లుగా తల్లిగారింట్లోనే ఉంటోంది. కుమారుడు ప్రవీణ్‌కుమార్‌కు వివాహమైంది. భార్యతో గొడవల కారణంతో ఆయన ఏడు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి మాణయ్య ఇంట్లో భార్య ఇందిరమ్మ, కూతుళ్లు, మనవరాలితో కలిసి ఉంటున్నారు.

ఈ క్రమంలో మద్యానికి బానిసైన మాణయ్య.. ఇంట్లో వాళ్లను దూషించేవాడు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి రాగా.. తలుపులు మూసి ఉన్నాయి. దీంతో దుర్భాషలాడిన మాణయ్య.. అక్కడే ఉన్న గడ్డపార, గొడ్డలితో తలుపులు విరగ్గొట్టే ప్రయత్నం చేశాడు. తల్లీకూతుళ్లు బయటకు వచ్చి మాణయ్య వద్ద ఉన్న గొడ్డలి, గడ్డపారను లాక్కున్నారు. దీంతో ఆగ్రహించిన మాణయ్య కుమార్తె సుకన్యపై అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. కోపోద్రిక్తురాలైన ఇందిరమ్మ తన వద్ద ఉన్న గొడ్డలితో భర్తను మెడపై నరికింది. తీవ్రంగా గాయపడిన మాణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్‌కుమార్, పుల్కల్‌ ఎస్సై శ్రీకాంత్‌ అదే రాత్రి ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. వివరాలు సేకరించారు. ఇందిరమ్మను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు