AP: సినిమా స్టైల్లో భర్తను హత్య చేయించిన భార్య .. మెడకు తాడు బిగించి.. ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నరేంద్రను భార్య హత్య చేయించింది. కిరాయి ముఠాకు రూ.2 లక్షల సుపారీ ఇచ్చింది. హత్య చేసిన అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది. నిందితులు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Jyoshna Sappogula 10 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP Crime: సినిమా స్టైల్లో భర్తను హత్య చేయించింది ఓ భార్య. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను కిరాయి ముఠాతో చంపించింది. ఈ దారుణమైన ఘటన ప్రకాశం జిల్లా (Prakasam) పొదిలిలో చోటుచేసుకుంది. ఈనెల 3న ఒంగోలు పీఎఫ్ ఆఫీస్లో సూపరింటెండెంట్గా పని చేస్తున్న నరేంద్రకుమార్ మృతి చెందాడు. నరేంద్రకుమార్ మృతిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. Also Read: సెల్ఫోన్ సిగ్నల్ లేని ఊరు.. 108కు ఫోన్ చేయాలన్నా ఇబ్బందే..! ఏఆర్ ఎస్పీ దామోదర్ ఈ కేసుపై వివరాలను వెల్లడించారు. పీఎఫ్ సూపరింటెండెంట్ నరేంద్రకుమార్ను భార్య హత్య చేయించిందని తెలిపారు. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని.. రూ.2 లక్షలతో సుపారీ ఇచ్చి భర్తను కిరాయి ముఠాతో హత్య చేయించిందన్నారు. నరేంద్ర నిద్రిస్తుండగా..నిందితులు అతడి మెడకు తాడు బిగించి హత్య చేశారని.. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని తెలిపారు. Also Read: నాకు న్యాయం చేయండి.. ప్రియుడి కోసం ప్రియురాలి పోరాటం..! నరేంద్రకుమార్ మృతిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు భయటపడ్డాయన్నారు. నిందితులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కాగా, ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధం కోసం భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపుతున్న ఘటనలు ఎక్కువ అయ్యాయి. అధికారులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. #prakasam #ap-crime-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి