హమ్మయ్య.. ముప్పు తప్పింది
అల్లూరి జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు పెనుప్రమాదం నుంచి బయటపడింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించకపోయుంటే బస్సులో ఉన్న ప్రయాణికుల ప్రాణాలన్నీ గాలికలిసిపోయేవే. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రాణాలు ఊపిరిపీల్చుకుంటున్నారు.
అల్లూరి జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు పెనుప్రమాదం నుంచి బయటపడింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించకపోయుంటే బస్సులో ఉన్న ప్రయాణికుల ప్రాణాలన్నీ గాలికలిసిపోయేవే. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రాణాలు ఊపిరిపీల్చుకుంటున్నారు.
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఆదివారం (జూలై 23) ఉదయం 8.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో అకోలాలో 107.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భలోని అమరావతి డివిజన్పై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రం పూర్తిగా సిద్ధంగా ఉందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అటు గుజరాత్ కూడా భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పంజాబ్ లో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా నాలుగో రోజూ వర్షాలు కొనసాగాయి. శనివారం రాష్ట్రంలోనే అత్యధికంగా 23.15.సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అటు కృష్ణా నదిలోకి సైతం తొలిసారి వరద మొదలైంది. అంతేకాక ఉమ్మడి జిల్లాలో లక్షన్నర ఎకరాల్లో పంట నీటమునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్గంగ సహా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించడంతో జనజీవనం స్తంభించిపోయింది.
తూర్పుగోదావరి జిల్లాను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఓ పక్క వరద నీటితో ధవళేశ్వరం నిండుకుండలా మారింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు ఎక్కువగా ఉండటంతో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా కోనసీమ వాసులను వరద నీరు భయపెడుతుంది. క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ లంక ప్రజలు జీవిస్తున్నారు. ఎప్పుడు వరద నీరు పెరుగుతుందా అని వణికిపోతున్నారు. ఇంకా వరద నీటిలో కోనసీమ ఎన్ని రోజులు ఉంటుందని లంక గ్రామాలు ఆందోళన చెందుతున్నారు.
దేశవ్యాప్తంగా వర్షాలు (Heavy Rains) దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని 22 రాష్ట్రాల్లోని 235 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. గుజరాత్, హిమాచల్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. హథిని కుండ్ బ్యారేజీ (Hathini Kund Barrage) నుంచి నీటిని విడుదల చేయడంతో ఢిల్లీ ప్రజలు మరోసారి వరద ముప్పును ఎదుర్కొంటున్నారు.
“బచ్పన్ బచావో ఆందోళన్” వంటి పలు సంస్థలను స్థాపించి వేలాది మందికి విద్యనందించడంతో పాటు దేశంలో బాలల హక్కుల కోసం నిరంతరంగా కృషి చేస్తూ నోబెల్ శాంతి బహుమతి అందుకున్న కైలాష్ సత్యార్థి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్తో కలిసి హైదరాబాద్లోని గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్లో మొక్కలు నాటారు.
తెలుగు రాష్ట్రాల్లో (Telangana, Ap) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత నాలుగు రోజుల నుండి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రాజెక్టుల వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లను ఎత్తివేస్తున్నారు అధికారులు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వరద వల్ల అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరద సహాయ చర్యలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం తోపాటు.. సహాయక చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు వరద నీరు వల్ల బయటకు రావద్దని వాతావరణ అధికారులు వెల్లడించారు. మరో 3 మూడు రోజులు భారీ వర్షాలు ఇలానే ఉంటాయని తెలిపారు.