సీఎం జగన్‌ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచే.. మంత్రి మేరుగు కీలక వ్యాఖ్యలు

నియోజకవర్గ మార్పుపై స్పందించారు మంత్రి మేరుగ నాగార్జున. సీఎం జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 2024 అసెంబ్లీలో వైసీపీ 175కి 175 సీట్లు గెలిచేలా అందరు కృషి చేయాలని అన్నారు.

New Update
సీఎం జగన్‌ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచే.. మంత్రి మేరుగు కీలక వ్యాఖ్యలు

Merugu Nagarjuna: మంత్రి మేరుగు నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తాన‌ని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. టార్గెట్ 175 ల‌క్ష్యంగా 2024 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశాల మేర‌కు 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించిందని అన్నారు. మేరుగు నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గ మార్పుపై తొలిసారి స్పందించిన మంత్రి మేరుగు నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: BREAKING: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తనకు నియోజకవర్గం మార్పుపై ఎలాంటి అసంతృప్తి లేదని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు వైయ‌స్ జ‌గ‌న్‌ బొమ్మపై గెలిచాను.. ఇప్పుడు సంతనూలపాడు నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా ఉన్నానని తెలిపారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, ఎమ్మెల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదు.. అందరూ మా వాళ్లే.. అందరూ సీఎం వైయ‌స్‌ జగన్‌ కోసం పనిచేస్తారని మంత్రి మేరుగు నాగార్జున స్ప‌ష్టం చేశారు.

ALSO READ: వారికే ఎమ్మెల్యే టికెట్.. సీఎం జగన్ సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ntr District కారు భీభత్సం .. ఏడుగురు అడ్డాకూలీలు పైకి దూసుకెళ్లింది..

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కారు భీభత్సం సృష్టించింది. చెరువు బజారు కట్ట వద్ద ఏడుగురు కూలీలు అందరు నిలబడి ఉండగా.. వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కారు యాక్సిడెంట్

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కారు యాక్సిడెంట్

Ntr District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఏడుగురు అడ్డాకూలీలపైకి కారు దూసుకెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. అయితే మేస్త్రీ పని చేయడానికి వచ్చిన  అడ్డాకూలీలు ఉదయం బజారు చెరువు కట్ట సర్కిల్ వద్ద నిలబడి ఉండగా.. అతి వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిమిత్తం  క్షతగాత్రులను వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ప్రస్తుతం కారును సీజ్ చేయగా.. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎమ్మెల్యే పరామర్శ.. 

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే  శ్రీరాం రాజగోపాల్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు. సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపవలసిందిగా డాక్టర్ కు సూచించారు.  గాయపడిన వారిలో ఓర్సు రామకృష్ణ, బత్తుల వెంకట గురువులు తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు. 

telugu-news | latest-news | ntr-district

Advertisment
Advertisment
Advertisment