Vegetable Prices: కూరగాయల ధరలు పైపైకి..వారంలో 30 నుంచి 60 శాతం పెరుగుదల!

కూరగాయల ధరలు రోజురోజుకి క్రమక్రమంగా ఆకాశనంటుతున్నాయి. కేవలం 2-3 వారాల వ్యవధిలోనే ఏకంగా 30 నుంచి 60 శాతం మేర పెరిగాయి. దీంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.

New Update
Vegetable Prices: కూరగాయల ధరలు పైపైకి..వారంలో 30 నుంచి 60 శాతం పెరుగుదల!

Vegetable Prices: కూరగాయల ధరలు రోజురోజుకి క్రమక్రమంగా ఆకాశనంటుతున్నాయి. కేవలం 2-3 వారాల వ్యవధిలోనే ఏకంగా 30 నుంచి 60 శాతం మేర పెరిగాయి. దీంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడం వల్లే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూరగాయల ఉత్పత్తి భారీగా తగ్గిపోగా.. డిమాండ్ పెరిగి ధరలు భగ్గుమంటున్నాయి.

రేట్లు పెరగడంతో సామాన్యులతో పాటు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వర్షాలతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించగా.. కూరగాయలు త్వరగా కుళ్లిపోతుండడంతో వ్యాపారస్తులు దిగుమతులను క్రమంగా తగ్గించగా.. రాష్ట్రంలో కూరగాయల సాగు కూడా క్రమంగా తగ్గిపోయింది. వీటి ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ పరిస్థితే ఉంది.

మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.40-50కి చేరగా.. టమాటా ధర రూ. 60-90గా ఉంది, వంకాయ రూ.40-50 పలుకుతుండగా.. పచ్చి మిర్చి రూ.80-120కి చేరుకోవడంతో .. మార్కెట్‌కు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, బీన్స్, క్యారట్, బీట్రూట్, క్యాప్సికం, కాకరకాయ, పుదీనా, కొత్తిమీర ఇలా అన్నింటి ధరలు రెట్టింపు కావడంతో.. క్రమంగా వంట గదిలో కూరగాయాలు కనమరుగవుతున్నాయి.

Also read: రేపే సివిల్స్‌ ప్రిలిమ్స్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

ఏపీ టెన్త్ ఫలితాల్లో కాకినాడ భాష్యం పాఠశాలకు చెందిన యల్ల నేహాంజని సత్తా చాటింది. 600 కు 600 మార్కులు సాధించి అరుదైన రికార్డు సృష్టించింది. పదో తరగతిలో ఫుల్ మార్కులు స్కోర్ చేయడం ఇదే తొలిసారని చెబుతున్నారు అధికారులు. దీంతో నేహాంజని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

New Update
2025 10th Result_ a girl scored 600_600 in 10th

2025 10th Result a girl scored 600 out of 600 in 10th

AP 10th Result:  ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. వీటితో పాటు ఓపెన్ 10th, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలు కూడా ప్రకటించారు. మొత్తం  81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 

 600/600 మార్కులు

అయితే పదో తరగతి ఫలితాల్లో ఏపీ కాకినాడ భాష్యం పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని సరికొత్త రికార్డు నెలకొల్పింది.  యల్ల నేహాంజని  అనే అమ్మాయి 600 కి 600 మార్కులు సాధించి సత్తా చాటింది. సబ్జెక్ట్స్ మాత్రమే కాకుండా లాంగ్వేజెస్ లో 100కి 100 మార్కులు రావడం విశేషం. పదో తరగతిలో ఫుల్ మార్కులు స్కోర్ చేయడం ఇదే తొలిసారని చెబుతున్నారు అధికారులు. దీంతో రాష్ట్రవ్యప్తంగా నెహాంజలికి అభినందనలు వెలువెత్తుతున్నాయి. భాష్యం విద్యాసంస్థలు యాజమాన్యం కూడా నేహాంజని  ఫలితాలపై సంతోషం వ్యక్తం చేసింది. 
600 కి 600 సాధించి విద్యాసంస్థలకే గర్వకారణంగా నిలిచింది అంటూ  ప్రశంసిస్తున్నారు

Also Read: Allu Arjun- Atlee: అల్లు అర్జున్ లుక్ టెస్ట్ .. 12 ఏళ్ళ పిల్లలతో ఊహించని యాక్షన్ సీక్వెన్స్

ఈ ఏడాది 1680 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి.  ఇందులో అబ్బాయిలు 78.31 శాతం పాస్ కాగా.. అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://results.bse.ap.gov.in/RES25/  ద్వారా తెలుసుకోవచ్చు.

latest-news | 10th-class-results 

Also Read: BIG BREAKING: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే

Advertisment
Advertisment
Advertisment