Breaking : ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బొలెరో.. 8 మంది మృతి! ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి బొలెరో వాహనం లోయలో పడడంతో అందులో ఉన్నవారిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించారు. By Bhavana 09 Apr 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Accident : ఉత్తరాఖండ్(Uttarakhand) లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి బొలెరో వాహనం లోయలో పడడంతో అందులో ఉన్నవారిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో వ్యకత్ఇ చికిత్స పొందుతూ మరణించారు. పలువురికి తీవ్రగాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అర్థరాత్రి కావడంతో సహాయ చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లా(Nainital District) లోని బేతాల్ఘాట్ డెవలప్మెంట్ బ్లాక్లోని ఉంచకోట్ ప్రాంతంలో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నేపాల్(Nepal) మూలానికి చెందిన 10 మంది వ్యక్తులను తనక్పూర్కు తీసుకుని వెళ్తుండగా బొలెరో(Bolero) ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై నుంచి 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు , సహాయక చర్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటి కారణంగా రెస్క్యూ ఆపరేషన్కు కష్టమైంది. మృతదేహాలు, గాయపడిన వారందరినీ బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందారు. డ్రైవర్తో సహా 8 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also read: క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఈ స్పెషల్ కోట్స్ మీకోసం.! #bolero #road-accident #uttarakhand #nainital-district సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి