Shocking Video: భర్తను మంచానికి కట్టేసి.. ఆ పార్ట్ లో సిగరేట్ తో కాల్చి.. ఈ రాక్షసి భార్య ఇంకేం చేసిందంటే!

యూపీకి చెందిన మెహర్ జాహన్‌ అనే మహిళ తన భర్తను తాళ్లతో కట్టేసి సిగరెట్‌ తో ఒంటి పై వాతలు పెట్టింది. నిందితురాలు ముందు భర్తకు మత్తు మందు ఇచ్చి అతడి కాళ్లు , చేతుల్ని కట్టేసింది. తర్వాత సిగరెట్ వెలిగించి చేతులు, కాళ్లు, ఒంటి పై వాతలు పెట్టింది.

New Update
Shocking Video: భర్తను మంచానికి కట్టేసి.. ఆ పార్ట్ లో సిగరేట్ తో కాల్చి.. ఈ రాక్షసి భార్య ఇంకేం చేసిందంటే!

సాధారణంగా మహిళలు గృహ హింసకు గురయ్యారనే సంఘటనల గురించి మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ మాత్రం సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఓ భార్య తన భర్తను కట్టేసి చిత్ర హింసలు పెట్టింది. దీంతో బాధలు భరించలేని భర్త సీసీ టీవీ ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వైరల్‌ గా మారింది.

ఈ దారుణ ఘటన యూపీలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన మెహర్ జాహన్‌ అనే మహిళ తన భర్తను తాళ్లతో కట్టేసి సిగరెట్‌ తో ఒంటి పై వాతలు పెట్టింది. బాధితుడి పేరు మహాన్‌ జైదీ. నిందితురాలు ముందు భర్తకు మత్తు మందు ఇచ్చి అతడి కాళ్లు , చేతుల్ని కట్టేసింది. తర్వాత సిగరెట్ వెలిగించి చేతులు, కాళ్లు, ఒంటి పై వాతలు పెట్టింది.

తన గుండెల పై కూర్చుని శరీరాన్ని కాల్చుతున్న సీసీ టీవీ ఫుటేజీలను తీసుకెళ్లి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆమె ఇలా చేసిందని ముందు పోలీసులు నమ్మలేదు. దీంతో భర్త తన వెంట తీసుకుని వచ్చి సీసీటీవీ రికార్డులను చూపించాడు.
దీంతో వాటిని చూసిన పోలీసులు నిర్ఘాంతపోయారు. మే ఐదో తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని సియోహరా జిల్లా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అటెంప్ట్‌ టు మర్డర్‌, టార్చర్‌, అసల్ట్‌ లాంటి నేరాలు మోపుతూ పలు ఐపీసీ సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు.

Also read: ఊటీ, కొడైకెనాల్‌ వెళ్తున్నారా..అయితే ఈ పాస్‌ తప్పనిసరి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment