Gold : ఇక నుంచి 9 క్యారెట్ల బంగారం రూ. 20 వేలే

త్వరలో దేశంలో 9 క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.9 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండే అవకాశం ఉంది.

New Update
Gold : ఇక నుంచి 9 క్యారెట్ల బంగారం రూ. 20 వేలే

9 carats Gold Rate : ప్రస్తుతం బంగారం ధరలు (Gold Rates) రూ. 70 వేలకు అటూ ఇటుగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అటువైపు చూడాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. ఆ మేరకు బంగారం దొంగతనాలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నగలు వేసుకుని బయటకు వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.

దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇకపై 9 క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం 2021తో పోలిస్తే 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54 శాతం పెరిగాయి. దీంతో నగలు వేసుకుని దొంగలకు ఇవ్వడం ఎందుకు అనే ఆలోచనతో చవక బంగారంపై మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం 9 క్యారెట్ల బంగారం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. 9 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బంగారంపైనా దాని నాణ్యతలను ధ్రువీకరించే హాల్‌మార్క్ ఉంటుంది.

Also Read: పవన్ చూపెట్టింది AI వీడియోనా?.. నెట్టింట ట్రోల్స్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1500 పాయింట్ల లాభం, నిఫ్టీ 23వేల మార్క్‌పైన ట్రేడింగ్‌తో స్టార్ట్ చేశాయి. నేడు టాటా మోటార్స్‌, లార్సెన్‌, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

New Update
Stock Markets Today:మంచిరోజు...లాభాల్లో స్టాక్ మార్కెట్

ట్రంప్ టారిఫ్‌లకు కాస్త బ్రేక్ పడినట్లే. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. వీటితో పాటు ఆర్‌బీఐ రెపో రేటును కూడా తగ్గించడం వల్ల సెన్సెక్స్ 1500 పాయింట్ల లాభం.. నిఫ్టీ 23వేల మార్క్‌పైన ట్రేడింగ్‌తో స్టార్ట్ చేశాయి. మార్నింగ్ 9.30 గంటల టైంలో సెన్సెక్స్‌ 1564 పాయింట్లతో 76,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 462 పాయింట్లతో 23,288 దగ్గర కొనసాగుతోంది. నేడు టాటా మోటార్స్‌, లార్సెన్‌, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌యూఎల్‌, నెస్లే షేర్లు నష్టాల్లో ట్రేడ్‌వుతున్నాయి.

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment