హార్థిక్ ఆశలపై నీళ్లు చల్లుతున్న శ్రేయస్ ఆయ్యర్!

2024 ఐపీఎల్ సిరీస్ ఫైనల్స్ వరకు శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో ఉంటాడా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.ఫైనల్‌లో గెలిచిన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మూడోసారి కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్‌ను ఫ్యూచర్ భారత కెప్టెన్‌ అని కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు. 

New Update
హార్థిక్ ఆశలపై నీళ్లు చల్లుతున్న శ్రేయస్ ఆయ్యర్!

2024 ఐపీఎల్ సిరీస్ ఫైనల్స్ వరకు శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో ఉంటాడా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్ 2024 ఫైనల్‌లో గెలిచిన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మూడోసారి కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయాస్ అయ్యర్‌ను ఫ్యూచర్ భారత కెప్టెన్‌ అని కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌లో గెలిచిన తర్వాత, మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప "భారత్‌కు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ అర్హుడే" అని వ్యాఖ్యానించాడు. భారత జట్టుకు కాబోయే కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. హార్దిక్ పాండ్యా గతంలో ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఆ జట్టుకు ట్రోఫీని గెలుచుకున్న తర్వాత మాత్రమే అతను భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ప్రస్తుతం భారత జట్టుకు కాబోయే కెప్టెన్‌గా పిలుచుకుంటున్నాడు. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు శ్రేయాస్ అయ్యర్ కూడా ప్రత్యర్థిగా మారాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో జరుగుతున్న గందరగోళం, తన కుటుంబంలోని సమస్యలతో అతను విసిగిపోయాడు.

ఈ స్థితిలో శ్రేయాస్ అయ్యర్ భారత జట్టు కెప్టెన్సీ వైపు అడుగు వేశాడు. కానీ శ్రేయాస్ అయ్యర్‌కు కాంట్రాక్ట్ ఇచ్చేందుకు బీసీసీఐ నిరాకరించడం గమనార్హం. మరి భారత జట్టులో చోటు దక్కించుకుంటాడా లేదా అనే దాన్ని బట్టి భారత జట్టుకు కాబోయే కెప్టెన్ అతనేనా? కాదా? అనేది తెలిసిపోతుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment