Unstoppable Show : బాలయ్య 'అన్ స్టాపబుల్' షోకు ఊహించని గెస్ట్.. ఎవరంటే?

బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ లేటెస్ట్ సీజన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెస్ట్ గా రాబోతున్నారట. బాలయ్య, రేవంత్ రెడ్డి ఇద్దరికి మంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే బాలయ్య అడిగిన వెంటనే రేవంత్ రెడ్డి ఓకే చెప్పినట్లు సమాచారం.

New Update
Unstoppable Show : బాలయ్య 'అన్ స్టాపబుల్' షోకు ఊహించని గెస్ట్.. ఎవరంటే?

NBK Unstoppable Show : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించే అద్భుతమైన టాక్‌షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటి మూడు సీజన్లు అద్భుతమైన విజయం సాధించిన ఈ షో నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 12, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.

publive-image

దసరా కానుకగా ఈ షోను ప్రేక్షకులకు అందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీ సీజన్‌లోనూ అగ్ర తారలను అతిథులుగా పిలిచే బాలయ్య ఈ సీజన్‌లో కూడా ఎవరిని పిలుస్తారో అనే దానిపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో లేటెస్ట్ సీజన్ లో ఊహించని గెస్ట్ ఒకరు రాబోతున్నారట. ఆయన మరెవరో కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని సమాచారం.

publive-image

Also Read : ఎట్టకేలకు బాలీవుడ్ నుంచి పిలుపు అందుకున్న శ్రీలీల.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్

బాలయ్య, రేవంత్ రెడ్డి ఇద్దరికి మంచి స్నేహం ఉంది. గతంలో ఈ ఇద్దరూ టీడీపీలో పనిచేశారు. ఆ చనువుతోనే బాలయ్య అడిగిన వెంటనే రేవంత్ రెడ్డి ఓకే చేప్పినట్లు సమాచారం. ఇప్పటికే ఈ షోలో పలువురు రాజకీయ నాయకులు హాజరవ్వగా.. ఈసారి లేటెస్ట్ సీజన్ లో రేవంత్ రెడ్డి కనుక వస్తే TRP రేటింగ్స్ బద్దలే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రవస్తి ఆరోపణలు.. పాటతో కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత

సింగర్ సునీత ఇన్‌డైరెక్ట్‌గా ప్రవస్తిని ఉద్దేశించి ఓ పోస్ట్ చేశారు. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలో కీరవాణి సంగీతం అందించిన 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు అనే పాటను షేర్ చేశారు. ప్రవస్తి గురించే ఈ పాటను షేర్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

New Update
singer pravasthi comments on Sunitha

singer pravasthi comments on Sunitha

గాయని ప్రవస్తి పాడుతా తీయగా షోలోని జడ్జిలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వారికి నచ్చిన వారికే ప్రోగ్రాంలో ఎంకరేజ్ చేస్తారని మిగతా వారిని తొక్కేస్తారని సింగర్ ప్రవస్తి కామెంట్లు చేసింది. అలాగే తనని బాడీ షేమింగ్ చేశారని తెలిపింది. అయితే దీనికి సింగర్ సునీత స్పందిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రవస్తి కూడా సునీత కోసం వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

కీరవాణి అందించిన పాటను..

ఈ క్రమంలో సింగర్ సునీత మరో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ప్రవస్తి గురించి డైరెక్ట్‌గా కాకుండా.. లిరిక్స్‌ను షేర్ చేశారు. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలో కీరవాణి సంగీతం అందించిన పాటను ఆమెను షేర్ చేశారు. 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు.. కోరిన తీరాన్నే చేరుకునే వరకు ఓ నిమిషమైనా నిదరపోవా..' అనే లిరిక్స్‌ పాటను షేర్ చేశారు. అయితే సునతీ సింగర్ ప్రవస్తి గురించే పాటను షేర్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

ఇదిలా ఉండగా పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో చాలా మంది సింగర్లు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అయితే ఈ షోలో జడ్జెస్‌గా సునీత, కీరవాణి, చంద్రబోస్‌లపై గాయని ప్రవస్తి ఆరోపణలు చేసింది. జడ్జిమెంట్‌ విషయంలో వివక్ష చూపుతున్నారని, కొందరు పాడకపోయినా కూడా సపోర్ట్ చేస్తూ.. చివరి వరకు తీసుకువచ్చారని తెలిపింది. దీనిపై సింగర్ సునీత కూడా క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా పలుమార్లు విమర్శలు చేయడంతో ఈ వీడియోను షేర్ చేశారు. 

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

Advertisment
Advertisment
Advertisment