Hyderabad: అండర్ ​గ్రౌండ్ మెట్రో...తొలిసారి ఎయిర్‌పోర్టు కారిడార్ లో ప్రయోగం..ఎక్కడో తెలుసా!

శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాంపౌడ్‌ సరిహద్దు నుంచి టెర్మినల్‌ వరకు 6.42 కి.మీ. అండర్​ గ్రౌండ్​లో మెట్రో నిర్మించనున్నారు. ఇది నగరంలో మొదటి భూగర్భ మార్గం కానుంది. బేసిక్​ స్టడీ తర్వాత భూమార్గంలో మెట్రో ఉండేలా డీపీఆర్‌లో ప్రతిపాదించారు.

New Update
Hyderabad: అండర్ ​గ్రౌండ్ మెట్రో...తొలిసారి ఎయిర్‌పోర్టు కారిడార్ లో ప్రయోగం..ఎక్కడో తెలుసా!

Underground Metro in Hyderabad: శంషాబాద్ ఎయిర్‌ పోర్టు వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్టం, పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు రాజధాని నగరంలో మెట్రో తొలి దశలో నిర్మించినవన్నీ ఆకాశ మార్గాలే. ఎయిర్‌పోర్టు కారిడార్‌ లో ఆకాశమార్గంతో పాటు మొదటిసారిగా భూమి పై కొంచెం, భూగర్భంలో మరికొంచెం దూరం నిర్మించేలా సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక లో పొందుపరిచారు.

రాయదుర్గం (Raidurgam) నుంచి నాగోల్‌ (Nagole) వరకు ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు మార్గాన్ని ఇక నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, పీ7 రోడ్, శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 33.1 కి.మీ. వరకు విస్తరించేలా రెండో దశలో ప్రతిపాదించారు. ఇందులో నాగోల్‌ నుంచి లక్ష్మీగూడ వరకు 21.4 కి.మీ. ఆకాశమార్గం ఉంటుంది. లక్ష్మీగూడ నుంచి పీ7 రోడ్డు ఎయిర్​పోర్టు ప్రాంగణం సరిహద్దు వరకు 5.28 కి.మీ. ఎట్‌ గ్రేడ్‌ (భూమార్గాన్ని) అధికారులు ప్రతిపాదించారు.

ఇక్కడ రహదారిపై డివైడర్‌ స్థలం చాలా విశాలంగా ఉంటుంది. నిర్మాణ వ్యయం తగ్గేందుకు భూమార్గంలో మెట్రో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో సూచించారు. బేసిక్​ స్టడీ చేశాక స్వల్పదూరం భూమార్గంలో తీసుకెళ్లేలా డీపీఆర్‌లో ప్రతిపాదించారు.

విమానాశ్రయ కంపౌడ్‌ సరిహద్దు నుంచి టెర్మినల్‌ వరకు 6.42 కి.మీ. అండర్​ గ్రౌండ్​లో మెట్రో నిర్మించనున్నారు. ఇది నగరంలో మొదటి భూగర్భ మార్గం కానుంది. ఇక్కడ మూడు స్టేషన్లు - కార్గో, టెర్మినల్, ఏరోసిటీ రాబోతున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ డిపో నిర్మించాలని ప్రతిపాదించారు.

Also Read: క్వార్టర్ బాటిల్ రూ.80 నుంచి 90 లోపే…ఏపీలో కొత్త మద్యం పాలసీలో అదిరిపోయే ఆఫర్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

LSG vs GT: గుజరాత్‌కు బిగ్ షాక్.. ఒక్కసారిగా పడిపోయిన వికెట్లు- 15 ఓవర్లకు ఎంత స్కోరంటే?

లక్నో vs గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో గిల్, సుదర్శన్ చెరో హాఫ్ సెంచరీ చేశారు. కానీ వరుస వికెట్లు కోల్పోవడంతో స్కోర్ తగ్గిపోయింది. 15ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజ్‌లో రూథర్‌ఫోర్డ్, బట్లర్ ఉన్నారు.

New Update
LSG vs GT

LSG vs GT

ఐపీఎల్ 2025 మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇరు జట్లు టైటిల్ కోసం పోటా పోటీగా మ్యాచ్‌లు ఆడుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ మరో మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే టాస్‌ నెగ్గిన లక్నో జట్టు.. మొదట బౌలింగ్ ఎంచుకుంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

10 ఓవర్లలో 0 వికెట్లు

దీంతో సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ క్రీజులోకి వచ్చారు. మొదటి నుంచి ఓ వైపు దూకుడుగా.. మరోవైపు వికెట్లు నష్టపోకుండా పరుగులు రాబట్టారు. కొట్టాల్సిన దగ్గర పెద్ద పెద్ద షాట్లు కొట్టారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీ చేశారు. ఇలా 10 ఓవర్లలో గుజరాత్ జట్టు ఒక్క వికెట్ పడకుండా 101 పరుగులు చేసింది. దీంతో 100 పరుగులు ఇచ్చినా.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లు తలలుపట్టుకున్నారు. 

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

రెండు హాఫ్ సెంచరీలు

అదే సమయంలో ఓపెనర్ గిల్‌(60)ను ఔట్ చేశారు. ఎట్టకేలకు ఓపెనర్ల భాగస్వామ్యానికి (73 బంతుల్లో 120 పరుగులు) లక్నో జట్టు తెరదించింది. ఇక ఆ తర్వాతే సాయి సుదర్శన్ కూడా పెవిలియన్‌కు చేరాడు. భారీ షాట్ ఆడే క్రమంలో సాయి సుదర్శన్‌ (56) క్యాచ్ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. రవి బిష్ణోయ్‌ వేసిన 13.1 ఓవర్లో నికోలస్‌ పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి సుదర్శన్‌ వెనుదిరిగాడు. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ (2) సైతం వెను వెంటనే చేతులెత్తేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతడు.. ఈ మ్యాచ్‌లో తడబడ్డాడు. దీంతో గుజరాత్ జట్టు 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో రూథర్ ఫోర్డ్ (1*), బట్లర్ (9*) పరుగులతో ఉన్నారు. 

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

( LSG vs GT | latest-telugu-news | IPL 2025)

Advertisment
Advertisment
Advertisment