Jet 2 Air ways: షుగర్‌ ఉందని విమానం నుంచి దింపేశారు!

లండన్ లోని జెట్‌ ఎయిర్ వేస్ మాత్రం షుగర్ అనేది చాలా పెద్ద సమస్యలాగా పెద్ద సీన్ క్రియేట్‌ చేసింది. మధుమేహం ఉందని ఏకంగా ఓ ప్రయాణికురాలని విమానం నుంచి బలవంతగంగా కిందకి దింపేశారు విమాన సిబ్బంది.

New Update
Jet 2 Air ways: షుగర్‌ ఉందని విమానం నుంచి దింపేశారు!

నేడు సమాజంలో ప్రతి పది మందిలో 8 మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఇది చాలా కామన్‌ అయిపోయింది. కానీ లండన్ లోని జెట్‌ ఎయిర్ వేస్ మాత్రం షుగర్ అనేది చాలా పెద్ద సమస్యలాగా పెద్ద సీన్ క్రియేట్‌ చేసింది. మధుమేహం ఉందని ఏకంగా ఓ ప్రయాణికురాలని విమానం నుంచి బలవంతగంగా కిందకి దింపేశారు విమాన సిబ్బంది.

ఈ సంఘటన గురించి ఆమె జెట్‌ 2 ఇమానయాన సంస్థకు ఫిర్యాదు చేసింది. ఆలస్యం అయినప్పటికీ కూడా ఆ సంస్థ ఆమెకు క్షమాపణలు చెప్పింది. అంతేకాకుండా ఆమె పర్యటన ఖర్చును కూడా తిరిగి చెల్లించింది. దీని గురించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..యూకేకి చెందిన 56 ఏళ్ల హెలెన్‌ టేలర్‌ అనే మహిళకు డయాబెటిస్‌ ఉంది.

Also read: నచ్చిన వారిని వివాహం చేసుకోవాలంటే.. నవరాత్రుల సమయలో ఇలా చేయండి!

ఈ కారణం చూపించి జెట్ 2 విమానం నుంచి ఆమెను కిందకి దింపేస్తున్నట్లు సిబ్బంది ఆమెకు తెలిపారు. ఆమె, ఆమె భర్త కలిసి విహార యాత్రకు వెళ్తున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. విమానం ఎక్కిన సమయంలో ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే విమానం ఎక్కిన తరువాత ఆమె కొంచెం నలతగా కనిపించారు.

దాంతో విమాన సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆమె వారితో '' ఇది నాకు మామూలే అని మొదటిసారిగా ఆహారం అప్పుడే తీసుకున్నానని..అందుకే డయాబెటిస్‌ కారణంగా కొంచెం ఇబ్బంది అయ్యిందని సిబ్బందికి వివరించింది. కొంచెం సేపు కూర్చుని నీళ్లు తాగితే సరిపోతుందని ఆమె వివరించిన కూడా విమాన సిబ్బంది వినలేదు.

Also read: జనసేనకు మరో భారీ షాక్‌..ఆ నేత గుడ్‌ బై చెప్పేశాడు!

పది నిమిషాల తరువాత విమాన సిబ్బంది ఆమెను మీ ఆరోగ్య కారణాల రీత్యా విమానంలో నుంచి కిందకి దిగిపోవాలని తెలిపారు. దీన్ని టేలర్‌ వారిని ప్రశ్నించారు. ఆమె దిగడానికి ఒప్పుకోక పోయినా కూడా వారు ఆమెను బలవంతంగా కిందకి దింపేశారు. దీని గురించి ఆమె కెప్టెన్‌ తో కూడా మాట్లాడారు.అయినప్పటికీ కెప్టెన్‌ కూడా ఆమెకు మద్దతివ్వలేదు.

దీని గురించి ఆమె మాట్లాడుతూ.. '' నా లైఫ్‌ లో ఇలాంటి సిల్లీ ఇన్సిడెంట్‌ ను ఎదుర్కొలేదు. మాతో వారు ప్రవర్తించిన తీరును ఇప్పటికీ నేను మరచిపోలేకపోతున్నాను. వారు మా పట్ల చూపించిన తీరు చాలా బాధకరమని ఆమె వాపోయారు. దీని గురించి ఆమె జెట్‌ 2 కి ఫిర్యాదు చేసారు. తాము నష్టపోయిన సొమ్మును వాపసు కోరుతూ ఆమె సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ముందు విమానయాన సంస్థ ఎలాంటి స్పందన ఇవ్వకపోయినప్పటికీ..ఆ తరువాత ఆమెకి జెట్‌ 2 క్షమాపణలు తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు