Andhra Pradesh: ఒంగోలులో దారుణం..మత్తు ఎక్కించి విద్యార్థిని చితకబాదిన వైనం

ఒంగోలు వినయ్ జూనియర్ కాలేజిలో విద్యార్థులు దుర్మార్గంగా ప్రవర్తించారు. సర్టిఫికేట్ల కోసం వచ్చిన ఒక విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు కలిసి చితకబాదారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
Andhra Pradesh: ఒంగోలులో దారుణం..మత్తు ఎక్కించి విద్యార్థిని చితకబాదిన వైనం

Ongole: ఒంగోలులో వినయ్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు చితకబాదారు. హర్షవర్ధన్ అనే విద్యార్థి ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. సర్టిఫికేట్స్ కోసం కళాశాలకు వెళ్లగా చరణ్, రాకేష్, నరేంద్ర అనే ముగ్గురు విద్యార్థులు హర్షవర్ధన్ని బయటకు తీసుకవెళ్లి కూల్ డ్రింక్ లో మత్తు కలిపి తాగించారు. మత్తులో ఉన్న హర్షవర్ధన్ ని క్లాస్ రూంలోకి తీసుకువెళ్లి చితకబాదారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమరాలో రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఒంగోలు వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Also Read:Cricket: ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రికీ పాంటింగ్ అవుట్..

Advertisment
Advertisment
తాజా కథనాలు