TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన

సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే వారికోసం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరో 200 కొత్త డీజిల్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

New Update
TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన

TSRTC MD SAJJANAR : ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి(Sankranti) పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను TSRTC అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోంది.

ALSO READ: టీడీపీలో ఫ్యామిలీ ప్యాకేజీ.. టికెట్ల కోసం నేతల పట్టు..

హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్ ప్రెస్ బస్సులను టీఎస్ఆర్టీసీ(TSRTC) ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar) పరిశీలించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య స్కీమ్‌ అమలు చేస్తుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

“ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2 వేలకు పైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అందులో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి యాజమాన్యం తెస్తోంది. వీటిన్నటిని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించాం.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీసజ్జనార్ తెలిపారు.

ASLO READ: వ్యూహం సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన నారా లోకేష్..

ఈ కొత్త బస్సుల్లో బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సుల్లో ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌) ఉందని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Man Marries Two Women : ఒకే ముహూర్తంలో ఇద్దరమ్మాయిలతో పెళ్లి...విషయం తెలిస్తే నవ్వాపుకోలేరు

ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అందులో వింతేముంది అనుకుంటున్నారా? నిజానికి అన్ని పెళ్లి కార్డుల్లాగే అది కూడా సాధారణమైన కార్డే. కానీ వరుడు ఒక్కడు.. వధువులు ఇద్దరు కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

New Update
 Man Marries Two Women

 Man Marries Two Women Photograph

 

wedding card
wedding card Photograph: (wedding card)

 Man Marries Two Women: ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అందులో వింతేముంది అనుకుంటున్నారా? నిజానికి అన్ని పెళ్లి కార్డుల్లాగే అది కూడా సాధారణమైన కార్డే. కానీ వరుడు ఒక్కడు.. వధువులు ఇద్దరు కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన యువకుడు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ కార్డు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఒకే హీరోను ఇద్దరు అక్కచెల్లెళ్లు ఇష్టపడడం సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. సినిమాల్లోనూ చివరికి ఎవరో ఒకరు త్యాగం చేయడం సర్వసాధారణం కానీ సత్యసాయి జిల్లాకు చెందిన ఒక వరుడికి అక్కాచెల్లెళ్లను ఇచ్చి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఒకే ముహూర్తంలో, ఒకే మండపంలో అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకునేందుకు వరుడు సిద్ధమయ్యాడు. బంధువులు, సన్నిహితుల్ని ఆహ్వానిస్తూ శుభలేఖలు కూడా ప్రింట్ చేశారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెళ్లి కార్డు వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..

 శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మగారిపల్లికి చెందిన గంగులమ్మ రాజువేలు కుమారుడు గంగరాజుకు.. కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి టౌన్‌కు చెందిన కె సుశీల రఘుల కుమార్తెలు శ్రీలక్ష్మి, ఐశ్వర్యలను ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు కార్డులో ప్రింట్ చేశారు. ఈ నెల 10న ఉదయం ముహూర్తం కాగా.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణం బెంగళూరు రోడ్, గుమ్మ్యగారిపల్లి క్రాస్ దగ్గర ఉన్న రంగమహాల్‌లో పెళ్లి చేస్తున్నారట. పెళ్లికి ముందు రోజు అంటే ఈ నెల 9న రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కాచెల్లెళ్లను ఒకే యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడం వెనుక కారణం ఏంటని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి:  పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!

శ్రీసత్యసాయి జిల్లా కర్ణాటకకు సరిహద్దులో ఉంటుంది.. దీంతో స్థానికులు కొందరు ఉపాధి కోసం కర్ణాటకకు వెళ్లి అక్కడే స్థిరపడతారు.. పొరుగునే ఉన్న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారు.. ఈ క్రమంలోనే శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన యువకుడ్ని కర్ణాటకకు చెందిన ఇద్దరు వధువులతో పెళ్లి చేస్తున్నారు. మొత్తానికి ఈ ఆయనకిద్దరు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వెడ్డింగ్ కార్డ్ పోస్ట్ కింద నెటిజన్లు స్పందిస్తున్నారు. 'లోకం మారుతోంది అంటే ఏంటో అనుకొన్న, ఈ వెడ్డింగ్ చూసి నిజమనిపిస్తోంది.. ఒకేసారి ఇద్దరమ్మాయిల ముద్దుల మొగుడుగా.. తమ్ముడు గంగరాజు నీ గుండె పది కాలాలు బ్రతకాలి' అంటూ వెడ్డింగ్ కార్డును షేర్ చేశారు ఓ నెటిజన్. 

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి


'పేరు మారింది కావచ్చు. అందుకే అలా రాసారేమో' అని ఒక నెటిజన్ అంటే.. 'ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త రా బాబు... నీ ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయి. ఆ.విషయంలో ఇద్దరినీ మెయింటైన్ చేయాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని అనుకో.. ముందు ధూమపానం మద్యపానం వంటి అలవాట్లు ఉంటే మానుకో.. లేకపొతే ముందు ముందు ఆ రెండు వ్యసనాలకు శాశ్వతంగా బానిస కావాల్సి ఉంటుంది.. జాగ్రత్త' అని మరొకరు సలహా ఇస్తూ రిప్లై ఇచ్చారు. 'ఒక్కరిని కట్టుకున్నాందుకే బాధపడుతుంటే, మరి నీ పరిస్థితి ఏంటి? గట్టి గుండె అనిచెప్పాలి' అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు. అయితే ఇద్దరిలో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయోమో అందుకే ఒకరికే ఇచ్చి పెళ్లి చేస్తున్నారని మరొకరు కామెంట్‌ చేస్తున్నారు.  మొత్తానికి ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

#sri-sathya-sai-district #womens #marriage
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు