Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం.. అక్కని చంపిన తమ్ముడు

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్జ నాయక్ తండలో మహిళా దారుణ హత్య జరిగింది. ఆటో కొనుగోలు లెక్కలలో తేడా వచ్చిందని అక్కను చంప్పాడు ఓ తమ్ముడు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది కోపంతో అక్కను మేకలు కోసే కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.

New Update
Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం.. అక్కని చంపిన తమ్ముడు

Brother Killed Sister in Kamareddy: ఈ విషాదకర సంఘటన చూస్తే మానవ సంబంధాలపై విరక్తి కలుగుతుంది. తోడుగా ఉంటూ కష్టసుఖాలను పంచుకోవాల్సిన తమ్ముడు.. తోడబుట్టిన అక్కని చూడకుంటా నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక వ్యవహారాలలో వచ్చిన గొడవలతో ఓ తమ్ముడు అక్కను దారుణంగా నరికి చంపాడు. ఈ విషాద ఘటన మాచారెడ్డి మండలం గజ్జ నాయక్ తండాలో చోటుచేసుకుంది. మంగళవారం రోజున ఆటో విషయంలో అక్కాతమ్ముడి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో తమ్ముడు యూసుఫ్ మీద అక్క రుక్సానా మాచారెడ్డి పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయంలో యూసుఫ్‎ను పోలీసులు మందలించారు.

ఈ క్రమంలో అక్క రుక్సానాపై కక్ష పెంచుకున్న తమ్ముడు యూసుఫ్‌ ఆమెను ఎలాగైన చంపాలని పగతో రగిలిపోతున్నాడు. కాగా.. మంగళవారం ( సెప్టెంబర్‌ 12న) మరోసారి అక్కాతమ్ముడు ఇద్దరూ గొడవపడ్డారు. ఈ తరుణంలో కోపోద్రిక్తుడైన యూసుఫ్..అక్కను మేకలు కోసే కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. తోడబుట్టిన అక్క అని కూడా చూడకుండా కిరాతకంగా నడిరోడ్డు మీద నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి యూసుఫ్ పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు పోలీసులు. రుక్సానా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యూసుఫ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.

Also Read: తణుకులో భారీ దొంగతనం…కేజీ బంగారం, నగదు దోచుకెళ్ళిన దొంగలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: విశాఖలో​ ప్రేమోన్మాది దాడి.. తల్లి కూతురిని చంపిన దుర్మార్గుడు

విశాఖపట్నం జిల్లా కొమ్మాది స్వయం కృషినగర్‌లో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని కత్తితో దాడి చేశారు. ఈ దాడి తల్లి కూతురు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
crime news vishaka

crime news vishaka

AP Crime: ఏపీలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తతను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ కొద్దీ రోజులుగా బెదిరించాడు. ఈ సంఘటన  విశాఖపట్నం జిల్లాలో బుధవారం కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం.. కొమ్మాది స్వయం కృషినగర్‌లో తల్లి, కుమార్తె  ఇద్దరు నివాసం ఉంటున్నారు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఏలాగైన హత్య చేయాలని పక్క ప్లాన్‌తోటి వారి ఇంటికి కత్తితో వచ్చి దాడి చేశారు. ఈ దాడి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె తీవ్రగా గాయాలయ్యాయి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది.

ఇద్దరిని బలి తీసుకున్న ప్రేమోన్మాది:

ప్రమాదంపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాతాన్ని  పరిశీలించారు. ఎలా జరిగిందని చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత ఇద్దరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లి కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేయటంతో కాలనీ వాసులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చదవండి: చర్మం, జుట్టును రక్షించే అద్భుతమైన ఆయుర్వేద ఉత్పత్తులు


( AP Crime | ap-crime-news | latest-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు