Yadadri: యాదాద్రి భక్తులకు బిగ్ అలర్ట్.. వారికి నో ఎంట్రీ!

యాదాద్రి ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. లక్ష్మీ నరసింహ స్వామి ఆర్జిత పూజలో పాల్గొనే భక్తులు ఇకనుంచి సాంప్రదాయ దుస్తులు ధరించాలని నిబంధనలు విధించింది. ఉచిత దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ నియమం వర్తించదు.

New Update
Yadadri: యాదాద్రి భక్తులకు బిగ్ అలర్ట్.. వారికి నో ఎంట్రీ!

Yadadri Dress Code: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తిరుపతిగా పిలువబడే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆర్జిత పూజలో పాల్గొనే భక్తులు ఇకనుంచి సాంప్రదాయ దుస్తులు ధరించాలని నిబంధనలు విధించింది. ఈ మేరకు జూన్ 1నుంచి ఆర్జిత సేవలు వినియోగించుకునే భక్తులంతా సంప్రదాయ దుస్తులే ధరించి రావాలని సూచించారు. ఇక ఉచిత దర్శనం కోసం క్యూలైన్​లో వచ్చే భక్తులకు ఈ నియమం వర్తించదని స్పష్టం చేశారు.

Also Read: ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏకంగా 8 నెలల జీతం బోనస్!

అలాగే ఆర్థిక పూజల్లో పాల్గొనే భక్తులు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని ఆలయ ఈవో చెప్పారు. ఇదిలావుంటే.. మే 20 నుంచి 22 వరకూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సిద్ధం చేశామని, 20న ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవచనం, లక్ష కుంకుమార్చన పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అలాగే దేవస్థానం పరిధిలో ప్లాస్టిక్‌ నిషేధించారు. ప్లాస్టిక్ కవర్స్, వాటర్‌ బాటిల్స్‌, ఇతరత్ర వస్తువులు అనుమతించమని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment