Population: పిల్లల్ని కనండి మహాప్రభో..! జపాన్ కొత్త రూల్.

పిల్లల్ని కనేందుకు వారానికి 3 రోజులు సెలవులు ప్రకటించిన జపాన్ ప్రభుత్వం. దేశంలో యువత కొరత వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2025 ఏప్రిల్ నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది అని తెలిపిన జపాన్.

New Update
japan population

japan population

Population In Japan: 'జనాభా'...  3 అక్షరాల పదమే గానీ.. చాలా పవర్‌ఫుల్. జనాభా సమస్య అనేది దేశ ఆర్థిక, సామాజిక స్థితిని ప్రభావితం చేసే కీలక అంశం. కొన్ని దేశాలు అధిక జనాభాతో బాధపడుతుంటే, జపాన్ లాంటి దేశాలు యువ జనాభా కొరతతో కష్టాలు పడుతున్నాయి. జపాన్‌లో పని చేయడానికి యువత అందుబాటులో లేదు, దీంతో పిల్లల్ని కనండి మహాప్రభో అని  జపాన్ ప్రభుత్వం ప్రజలను వేడుకొంటోంది.

Also Read : బ్రెయిన్ స్ట్రోక్.. వీటిని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు!

పిల్లల్ని కనండి మహాప్రభో..

సంతానోత్పత్తి పెంచడానికి ప్రజలకు వారానికి 3 రోజులు సెలవులు ఇచ్చే కొత్త రూల్ ను అమలు చేయనుంది. ఇది పెళ్లైన జంటలను తమ కుటుంబాలతో సమయం గడపటానికి, సంతానాన్ని పెంచేందుకు జపాన్ తీసుకున్న చర్య.

Also Read :  ఎలుగుబంటిని రక్షించిన భారత సైన్యం

అయితే, ఇండియాలో మాత్రం సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతోంది. 2015-16లో 2.2 ఉండగా, 2019-21 సర్వే ప్రకారం 2కి తగ్గింది. ఏపీ సీఎం చంద్రబాబు వంటి నేతలు సంతానోత్పత్తి పెరగాలని సూచిస్తున్నా, నిపుణులు మాత్రం జనాభా తగ్గడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు.

Also Read :  శీతాకాలంలో ఈ పండు తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు!

Also Read: జగిత్యాల గురుకులంలో కలకలం.. ఇద్దరు విద్యార్థులకు పాము కాటు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: ఆ టెర్రరిస్ట్ తల కావాలి..లెఫ్టినెంట్ నర్వాల్ సోదరి

పహల్గామ్ ఉగ్రదాడిలో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణించారు. ఆయన సోదరి హరియాణా సీఎం నయాబ్ సింగ్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తన అన్నను చంపిన వాడి తల కావాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

New Update
sis

Navy Officer Vinay Narwal Sister

కాల్పులు జరిగిన తర్వాత తన అన్నయ్య వినయ్ నర్వాల్ గంటన్నర పాటూ బతికే ఉన్నాడని ఆయన సోదరి చెబుతున్నారు. కానీ అప్పుడు అతనికి ఎలాంటి సహాయం అందలేదని వాపోయారు. నర్వాత్ మృతదేహానికి నివాళులు అర్పించడానిక వచ్చిన హరియాణా ముఖ్యమంత్రి సీఎం నయాబ్ సింగ్ సైనీ ఎదుట నర్వాల్ సోదరి కన్నీటి పర్యంతం అయ్యారు. తన సోదరుడిని ఎవరైనా కాపాడి ఉండాల్సిందని...అలా చేసి ఉంటే ఇప్పుడు బతికే ఉండేవారని చెప్పుకొచ్చారు. నా సోదరుడు ముస్లిం కాదని తెలిసి ఉగ్రవాదులు మూడు సార్లు కాల్చారని ఆమె చెప్పారు. వినయ్ కు న్యాం జరగాలని...అతడిని చంపినవాడి తల కవాలని ఆమె ముఖ్యమంత్రిని సైనీని డిమాండ్ చేశారు. 

పెళ్లైన ఏడు రోజులకే

పెళ్లైన ఏడు రోజులకే లెఫ్టినెంట్ వినయ్ ఉగ్రవాదుల దాడులో చనిపోయాడు ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, హిమాన్షిల పెళ్లి 2025 ఏప్రిల్ 16న జరిగింది.  వారిద్దరూ హనీమూన్ కోసమని జమ్మూకశ్మీర్ కు వెళ్లారు.  అక్కడ టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో  లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చనిపోయాడు.  తన కళ్లముందే కట్టుకున్న భర్త చనిపోవడంతో ఆమెకు ఒక్కసారిగా నోటినుంచి మాటరాలేదు.  ఆమె రోదిస్తూ.. '' మాకు పెళ్లయి ఆరు రోజులే అయ్యింది. ఈ ఘటన జరిగినప్పడు మేము పానీపూరీ తింటున్నాం. ఒక్కసారిగా ఓ ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగాడు. వెంటనే తన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని'' ఆమె ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

today-latest-news-in-telugu | navy-officers | Pahalgam attack | terrorist 

Also Read: USA: పాక్ ఆర్మీ ఛీప్ మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటివాడు..పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్

Advertisment
Advertisment
Advertisment