Weather Alert: రేపు కేరళను తాకనున్న రుతుపవనాలు.. తెలంగాణ, ఏపీకి ఎప్పుడంటే

రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతారణ శాఖ తెలిపింది. కేరళను తాకిన 5 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది.

New Update
Weather Alert: ఈ నెల 12 వరకు భారీ వర్షాలు

రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతారణ శాఖ తెలిపింది. ఈ రుతుపవనాల ప్రారంభానికి కేరళలో అనుకూల పరిస్థితి ఉందని అంచనా వేసింది. అలాగే కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ముందస్తు రుతుపవనాల ప్రభావం ఉంటుందని పేర్కొంది. కేరళను తాకిన 5 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఇవి విస్తరిస్తాయని పేర్కొంది.

Also Read: కార్లు కడిగితే రూ.2000 ఫైన్ .. సర్కార్ షాకింగ్ నిర్ణయం

ఇదిలాఉండగా.. మరోవైపు దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఢిల్లీ అత్యధికంగా రికార్డు స్థాయిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికే ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు అధికారులు రెడ్ అలర్డ్ జారీ చేశారు. పాకిస్థాన్‌లో కూడా 50 డిగ్రీలకు పైగా ఎండలు ఉన్నాయని.. అక్కడి నుంచి వీచే వేడిగాలుల ప్రభావంతో మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Also read: గెలిచాక ఎలా చేద్దాం.. చంద్రబాబు, పవన్ కీలక భేటీ!

అలాగే సూర్యూడు సైతం భూమికి దగ్గరగా రావడం వల్ల ఎండల తీవ్రత పెరిగిందని తెలిపారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం వల్ల రెండు, మూడు రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొన్నారు. అంతాకాదు జూన్‌ లో కూడా 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని చెప్పారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు ఎక్కువగా నీటిని, ఫ్లూయిడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan : విద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన పరిస్థితిపై విచారణ

పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

New Update
pawan kalyan

pawan kalyan Photograph: (pawan kalyan)

Pawan Kalyan :పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు  పవన్ కళ్యాణ్  ఆదేశించారు. కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు.  పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి అనే దానిపై విచారణ చేయాలని ఆదేశించారు.  సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్ ను ఏమైనా నియంత్రించారా విషయాలను కూడా తెలుసుకోవాలన్నారు.తదితర అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు పవర్‌ కళ్యాణ్‌  ఆదేశాలు జారీ చేశారు.

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

 తన పర్యటనల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఇప్పటికే పవన్ సూచించారు.కూటమి ప్రభుత్వంలో ముఖ్యుల పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ ,హెలికాప్టర్ లో వెళ్ళినా రోడ్డుపై ట్రాఫిక్ నిలవడం, చెట్లు కొట్టడం లాంటివి చేయడం ఆపడం లేదని తెలిపారు.పార్టీ శ్రేణులు, నాయకులకు సైతం క్రేన్ దండలు కార్యక్రమాలు, ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Also read :  Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్‌ లల్లాకు సూర్య తిలకం


కాగా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్ష కి ఆలస్యం అయిందని కొంతమంది విద్యార్థులు ఆరోపించారు. కన్వాయి వల్ల - పెందుర్తి అయాన్ డిజిటల్  JE అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళాల్సి వచ్చిందని వాపోయారు. 30 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష   రాయకుండా వెనిదిరగాల్సి వచ్చింది. దీనివల్ల - పిల్లల భవిష్యత్తు అగమ్య అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు