Toll Charges : వినియోగదారులకు షాక్‌.. పెరిగిన టోల్‌ ఛార్జీలు.. ఎంతంటే?

టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు అమలులోకి వచ్చాయి. ఏడాదికి ఒకసారి ఏప్రిల్‌ 1న టోల్‌ రుసుం పెరుగుతుంది. హైదరాబాద్‌-విజయవాడ NH65పై కార్లు, జీపులు, వ్యాన్‌ల, తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఎంత ఛార్జీ పెరిగిందో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Toll Charges : వినియోగదారులకు షాక్‌.. పెరిగిన టోల్‌ ఛార్జీలు.. ఎంతంటే?

Toll Charges : ఒకటో తారిఖు వచ్చిందంటే ఏదో ఒక రేటు పెరుగుతుంటుంది. అటు జీతం పెరగదు కానీ ప్రతీనెలా ఖర్చులు(Every Month Expenses) మాత్రం పెరుగుతుంటాయి. ఈ ఏప్రిల్‌ 1న కూడా ఖర్చులు పెరిగే న్యూస్‌ ఒకటి తెలిసింది. అది ఏంటంటే టోల్‌ ఛార్జీలు పెరిగాయన్నమాట. దేశవ్యాప్తంగా పలు టోల్‌ప్లాజా(Toll Plaza) ల వద్ద పన్ను చెల్లింపు ధరలు పెరిగాయి. అందులో విజయవాడ-హైదరాబాద్‌ హైవే కూడా ఉంది. ఇది ఏపీ-తెలంగాణ(AP-Telangana) ప్రజలు ఎక్కువగా తిరిగే రహదారి. ముఖ్యంగా పండుగల సమయంలో ఈ హైవేపై రద్దీ పీక్స్‌లో ఉంటుంది. చాలామంది సొంతవాహనాల్లోనే ప్రయాణిస్తారు. కార్లు వేసుకోని ఊర్లు పోతారు. ఇక పెరిగిన ధరలు ఏప్రిల్ 1 అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఎంత పెరిగాయో తెలుసుకోండి.

ఎంత పెరిగాయంటే?
హైదరాబాద్- విజయవాడ(Hyderabad-Vijayawada) నేషనల్‌ హైవే నెంబర్‌-65పై టోల్‌చార్జీలు పెరిగాయి. ఈ టోల్ పెంపు నిర్ణయం జీఎంఆర్‌ది. అది ఒక కాంట్రాక్ట్ సంస్థ. ఇక ఒక్కో వాహనానికి రూ. 5 నుంచి రూ.40 వరకు ఫీజును పెంచారు. అటు అదే సమయంలో స్థానికుల నెలవారీ పాసుకు రూ.330ల నుంచి రూ.340లకు పెంచారు. కార్లు, వ్యాన్‌లు, జీపులకు ఒక వైపు ప్రయాణానికి రూ.5 పెంచారు. అంటే రానూపోనూ కలిపి రూ.10 పెరిగినట్టు లెక్కా. ఇక తేలికపాటి బిజినేస్‌ వాహనాలు ఒక వైపు రూ.10, ఇరు వైపులా అయితే రూ.20 పెరిగింది. ట్రక్కు, బస్సులకు రూ.25, రూ.35, భారీ రవాణా వాహనాలకు రూ.35, రూ.50 చొప్సున పెంచారు. 24 గంటల లోపు రిటర్న్‌ జర్నీ చేస్తే అన్ని రకాల వాహనాలకు ఫీజు చెల్లింపులో 25శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

2023-2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో, హైదరాబాద్-విజయవాడ హైవే ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.1,222 మిలియన్లుగా ఉంది. అదే సమయంలో, సగటు రోజువారీ ట్రాఫిక్ 24.3 వేల వాహనాలకు చేరుకుంది. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ 2023 వరకు హైదరాబాద్‌-విజయవాడ హైవేపై సగటు రోజువారీ ట్రాఫిక్‌ ఏడాదితో పోలిస్తే 5.9 శాతం పెరిగింది.

Also Read : మొదటిసారి గార్డెనింగ్ చేయబోతున్నారా? ఈ చిట్కాలు మీ కోసమే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan Son: పవన్ చిన్న కుమారుడిని సింగపూర్‌లో ఎందుకు చదివిస్తున్నాడో.. కారణం తెలుసా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడుకి సింగపూర్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తన భార్య అన్నా లెజ్‌నేవా సింగపూర్‌లో మాస్టర్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే తన చిన్న కుమారుడు సింగపూర్‌లో చదువుతున్నాడు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్తుంటాడు.

New Update
Pawan Kalyan younger son

Pawan Kalyan younger son Photograph: (Pawan Kalyan younger son)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఓ స్కూల్‌లో ప్రమాదం జరగడంతో పవన్ కుమారుడు గాయపడ్డాడు. వెంటనే పవన్ కళ్యాణ్తన పర్యటన ముగించుకుని సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ఈ ప్రమాదం తర్వాత చాలా మందికి ఓ సందేహం కలిగింది. పవన్ కుమారుడిని ఇండియాలో కాకుండా సింగపూర్‌లో ఎందుకు చదివిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

భార్య చదువు కోసం కుమారుడిని కూడా..

పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్‌నేవా సింగపూర్‌లో ఉంటున్నారు. గతేడాది ఆమె సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆమె చదువు కోసం కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కూడా సింగపూర్‌లో చదివిస్తున్నారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లి వస్తుంటారు. 

ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్‌నేవా యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ అందుకునే కార్యక్రమానికి ఇటీవల పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అన్నా లెజ్‌నేవా రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ యూనివర్శిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్‌లో డిగ్రీని పూర్తి చేశారు. ఓరియంటల్ స్టడీస్ అంటే ఆసియా దేశాల గురించి చదవడం, భాషలు, జీవన విధానం గురించి పరిశోధనలు చేయడం. వీటిలో థాయిలాండ్ చరిత్ర గురించి తప్పకుండా స్టడీ చేస్తారు. ఈ క్రమంలోనే ఆమె సింగపూర్‌లో ఉంటూ ఓ స్కూల్‌లో కుమారుడిని చదివిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

ఈ ప్రమాదంలో పవన్ కుమారుడికి కాళ్లు చేతులకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

ఇది కూడా చూడండి: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

 

telugu-news | latest-telugu-news | singapore | Pawan Kalyan | today-news-in-telugu | andhra-pradesh-news

Advertisment
Advertisment
Advertisment