Tirupat: బాలుడి కిడ్నాప్‌ను ఛేదించిన పోలీసులను అభినందించిన ఎస్పీ

తిరుపతి బస్టాండ్‌లోకిడ్నాప్‌ అయిన బాలుడి కేసును పోలీసులు చేధించారు. బాలుడిని నిందితుడు సుధాకర్ తీసుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. సుధాకర్‌ చిన్నారిని ఏర్పేడులోని తన అక్క ఇంటికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడు ఏర్పేడులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితుడి నుంచి బాలుడ్ని తీసుకొని ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడకు చేరుకున్న బాలుడి కుటుంబ సభ్యులకు పోలీసులు చిన్నారిని అప్పగించారు.

New Update
Tirupat: బాలుడి కిడ్నాప్‌ను ఛేదించిన పోలీసులను అభినందించిన ఎస్పీ

తిరుపతి బస్టాండ్‌లోకిడ్నాప్‌ అయిన బాలుడి కేసును పోలీసులు చేధించారు. బాలుడిని నిందితుడు సుధాకర్ తీసుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. సుధాకర్‌ చిన్నారిని ఏర్పేడులోని తన అక్క ఇంటికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడు ఏర్పేడులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితుడి నుంచి బాలుడ్ని తీసుకొని ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడకు చేరుకున్న బాలుడి కుటుంబ సభ్యులకు పోలీసులు చిన్నారిని అప్పగించారు. కాగా బాలుడు కిడ్నాప్‌ అయిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఈ కేసును చేధించడంతో జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని అభినందించారు.


బాలుడ్ని ఎత్తుకెళ్లిన వ్యక్తి సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపిన జిల్లా ఎస్పీ.. నిందితుడిపై గతంలో ఎలాంటి కేసులు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. తిరుమల స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లల చేతులను ఎట్టి పరిస్ధితుల్లో వదిలకూడదని, రాత్రి సమయంలో అనుమానాస్పదంగా ఎవరైనా కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి సూచించారు.

తిరుమతి ఆర్టీసీ బస్టాండ్‌లో అర్థరాత్రి రెండేళ్ల బాబు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ ఘటన నిన్న రాత్రి రెండు గంటల సమయంలో రిజర్వేషన్ కౌంటర్ దగ్గర చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సోమవారం శ్రీవారి దర్శనానికి చెన్నైకి చెందిన చంద్రశేఖర్-మీనా దంపతులు తమ రెండో కుమారుడు మురుగేశన్‌ తో కలిసి వచ్చారు. అయితే.. అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో ఆ బాలుగు కిడ్నాప్ కు గురైనట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ వయస్సు సుమారు32 సంవత్సరాలు ఉండవచ్చు అని పోలీసులు వెల్లడించారు. కిడ్నాపర్ వైట్ షూ, గ్రీన్ కలర్ షర్ట్‌తో వేసుకుని ఉన్నాడని తెలిపారు. రిజర్వేషన్ కౌంటర్ నుంచి బాలుడ్ని బస్టాండ్ బయట గల అంబేద్కర్ విగ్రహం వైపు ఆ కిడ్నాపర్ తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు వివరాల ప్రకారం.. వరుస సెలవుల నేపథ్యంలో చెన్నైకి చెందిన ఒక కుటుంబం మూడు రోజుల క్రితం తిరుమలకు వచ్చింది. స్వామి వారి దర్శనం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లడానికి సిద్ధం అవుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో తిరుపతి బస్‌స్టాప్‌లో చెన్నై బస్ కోసం ఎదురుచూస్తుండగా బాలుడి కిడ్నాప్ జరిగింది. అప్పటివరకు కూడా పిల్లోడిని ఎంతో జాగ్రత్తగా తండ్రి చూసుకున్నట్లుగా కూడా సీసీ టీవీ ఫుటేజ్ లో స్పష్టం అవుతోంది. అదే సమయంలో పిల్లోడికి ఆకలిగా ఉంటే.. కొన్ని తినుబండారాలు, పాలు అలాంటివి కొనేందుకు తండ్రి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పిల్లలకి కావలసిన కొనిచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి అక్కడే కొద్దిసేపు బస్ కోసం ఎదరు చూశారు. బస్సు రాకపోవటంతో కొంచెం రెస్ట్ తీసుకుందామని అలా కాసేపు పడుకున్నారు. తల్లిదండ్రులు నిద్రపోతున్నది చూసి.. ఇంతలో బస్టాండ్ ఆవరణంలో తిరుగుతున్న దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. 2 గంటల సమయంలో బాబుని కిడ్నాప్ చేశారు. బాబు ఎత్తుకెళ్ళిన ఇద్దరూ అనుమానితులను పోలీసులు గుర్తించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

New Update
Rains

ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 'శుక్రవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.  ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. చెట్ల క్రింద నిలబడద్దొని అధికారులు పేర్కొన్నారు.

Also Read: Emergency landing: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

గురువారం మూడు గంటలు నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, తిరుపతి, ఎన్టీఆర్, అల్లూరి జిల్లాల్లో వర్షంతో పాటుగా పిడుగులు పడ్డాయి. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు సూచించారు. గురువారం సాయంత్రం 6 గంటల నాటికి కృష్ణా జిల్లా పెదఅవుటపల్లిలో 68.9మిమీ, ప్రకాశం జిల్లా సానికవరంలో 65.2 మిమీ, ఎర్రగొండపాలెంలో 62 మిమీ అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. 18 ప్రాంతాల్లో 20మిమీ కంటే ఎక్కువ వర్షపాతం రికార్డైంది' అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Also Read: Rahul Gandhi: ట్రంప్‌ సుంకాలు భారత్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి: రాహుల్ గాంధీ

తెలంగాణలో కూడా భారీ వర్షం పడింది. గురువారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో ప్రారంభమై ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం పడింది. ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి నగర జీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలో మరో మూడు రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అంచనా తెలిపింది. ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని.. 7, 8 తేదీల్లో పొడి వాతావరణం ఉంటుందని.. ఆ తరువాత మళ్లీ తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Also Read: Hansika: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

Also Read: Trump tariffs: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

ap | ap-rains | ap rains latest news | ap rains latest update | ap rains latest updates | ap rains today | ap rains update | weather | andhra pradesh weather | andhra-pradesh-weather-forecast | andhra-pradesh-weather-report | ap today weather update | ap-weather | AP Weather Alert | latest-news | latest telugu news updates | latest-telugu-news 

Advertisment
Advertisment
Advertisment