Educational Tips : ఈ టిప్స్ పాటిస్తే మ్యాథ్స్ లో 90 మార్కులు గ్యారెంటీ!

CBSE క్లాస్ 12 మ్యాథమెటిక్స్ బోర్డ్ పరీక్షలో అధిక మార్కులు సాధించడానికి సిలబస్‌పై పట్టు, ప్రాక్టీస్,గత పేపర్ల నుంచి, ఉపాధ్యాయుల నుంచి సలహాలు పాటించడం వంటి చిట్కాలను పాటిస్తే కచ్చితంగా మ్యాథ్స్ లో 90 కి పైగా మార్కులు సాధించవచ్చు.

New Update
Educational Tips : ఈ టిప్స్ పాటిస్తే మ్యాథ్స్ లో 90 మార్కులు గ్యారెంటీ!

CBSE : సీబీఎస్‌ఈ(CBSE)  12 క్లాస్‌ మ్యాథ్‌ బోర్డ్‌ ఎగ్జామ్‌ 2024(Inter Maths Board Exams 2024) లో 90 ప్లస్ మార్కులను స్కోర్ చేయడం సరైన ప్రిపరేషన్, విధానంతో సాధించవచ్చు. CBSE క్లాస్ 12 మ్యాథమెటిక్స్ బోర్డ్ పరీక్షలో అధిక మార్కులు సాధించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.

1. సిలబస్‌పై పట్టు సాధించండి:

మొత్తం సిలబస్‌ను సమగ్రంగా అర్థం చేసుకోవడంలో విజయానికి మొదటి మెట్టు ఉంటుంది. కవర్ చేయడానికి అన్ని అంశాల వివరణాత్మక జాబితాను తయారు చేసుకోవాలి. ముందుగా కష్టంతో కూడుకున్న వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

2. NCERT పాఠ్యపుస్తకాలు:

NCERT పాఠ్యపుస్తకాలతో బలమైన పునాదిని ఏర్పరచడం, బోర్డు పరీక్షలలో విజయానికి పునాదిగా నిలుస్తుంది. ఈ వనరుల నుండి కాన్సెప్ట్‌ల గురించి స్పటిక-స్పష్టమైన అవగాహనను నిర్ధారించడం అత్యవసరం.

3.  కంటెంట్‌ను మూడు వర్గాలుగా విభజించవచ్చు
మనం చదవాలి, మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటున్న కంటెట్‌ ని మూడు వర్గాలు విభజించి చదువుకోవాలి. అందులో ముందు కొంచెం తెలికైనవి, కొంచెం కష్టమైనవి, బాగా కష్టమైనవి. వాటిని అన్నింటిని విభజించుకుని చదువుకోవాలి.

4. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్
ప్రాక్టీస్‌ మేక్స్‌ మ్యాన్‌ పరఫెక్ట్‌(Practice Makes Man Perfect) అంటూ ఉంటారు. మ్యాథ్స్(Maths) ని ఎంత బాగా ప్రాక్టీస్‌ చేస్తే అంత బాగా గుర్తంటాయి. విభిన్న శ్రేణి సమస్యలను పరిష్కరించడం, కేస్ స్టడీస్‌ను కలిగి ఉండటం ద్వారా సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచుకోవచ్చు.

5. గత పేపర్ల నుంచి ..

మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను పరిష్కరించడం ద్వారా పరీక్షా సరళి, ప్రశ్న రకాలపై కొంచెం అవగాహన వస్తుంది. అదనంగా, ఊహించిన నమూనాను సమగ్రంగా గ్రహించడానికి CBSE విడుదల చేసిన నమూనా ప్రశ్న పత్రాలు చూసుకోవడం వల్ల ప్రశ్నల మీద మంచి అవగాహన వస్తుంది.

Also Read : వెంకయ్యనాయుడు, చిరంజీవిలను సన్మానించిన సీఎం రేవంత్‌

6. సమర్థవంతమైన పునర్విమర్శ పద్ధతులు

ఇప్పటికే మీరు కవర్ చేసిన అంశాలను క్రమం తప్పకుండా సమీక్షించుకోవడం కూడా కీలకం. పరీక్ష తేదీ దగ్గరగా ఉంది అనుకున్న సమయంలో వాటిని మరోసారి సమీక్షించుకోవడం చాలా ముఖ్యం.

7. ఉపాధ్యాయుల నుంచి సలహాలు

ఏదైనా చిన్న అనుమానం ఉన్నా సరే ఉపాధ్యాయుల నుంచి కచ్చితంగా మార్గదర్శకత్వం తీసుకోవాలి. వారి నైపుణ్యం మన సందేహాలను నివృత్తి చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది.

8. సమయ నిర్వహణ నైపుణ్యాలు

సమస్య-పరిష్కార సెషన్‌లలో సమయం అనేది చాలా ముఖ్యం పరీక్ష సమయంలో కీలకమైన ఆస్తి అంటే సమయం అని చెప్పుకొవచ్చు. సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రతి ప్రశ్నకు నిర్దిష్ట సమయ ఫ్రేమ్‌లను కేటాయించండి.

9. సరైన ఆరోగ్యం

పరీక్షల సమయంలో తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం , సరైన ఆహారం కూడా చాలా ముఖ్యమైనది.

Also read: నమీబియా దేశాధ్యక్షుడు గింగోబ్‌ కన్నుమూత!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hafiz Saeed : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

పాకిస్తాన్‌తో సింధు జల ఒప్పందాన్ని తక్షణమే భారత్ రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
modi, Hafiz Saeed

modi, Hafiz Saeed

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత మోదీ సర్కార్ కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్‌తో సింధు జల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకుంది. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మీరు పాకిస్థాన్ కు నీళ్లు ఆపుతారా? కశ్మీర్లో డ్యామ్ కట్టి నీళ్లు ఆపితే మేము మీ శ్వాస ఆపుతాం. ఆ నదుల్లో మీ రక్తం ప్రవహిస్తుంది' అని హఫీజ్ గతంలో మాట్లాడిన వీడియోను పాక్ ISI వైరల్ చేస్తూ పాకిస్థానీలను రెచ్చగొడుతోంది. 

Also Read :  జాగ్రత్తగా చూసుకున్నాడు...మా బంధానికి పేరు పెట్టలేను...సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ప్రతీ నీటి బొట్టుపై హక్కు ఉంది

మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ తీవ్రంగా విమర్శించింది.  సింధు జలాల్లోని ప్రతీ నీటి బొట్టుపై తమకు హక్కు ఉందన్నారు పాకిస్తాన్ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము న్యాయపరంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడమంటే యుద్ధం ప్రకటించడమేనన్నారు. ప్రపంచ బ్యా్ంకు వంటి సంస్థలు కుదుర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగలేదని ఆ దేశ మంత్రి అవాయిస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీ్ట్ చేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిర్లక్ష్యంగా నిలిపివేయడం పిరికితనం, చట్టవిరుద్ధమైన చర్య అని పాకిస్తాన్ విద్యుత్ మంత్రి అవాయిస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీ్ట్ చేశారు.   

Also Read :  భద్రతా బలగాలకు మావోయిస్టు అగ్రనేత లేఖ

సింధు జలాల ఒప్పందం 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరింది. సింధూ నది టిబెట్‎లో పుట్టి.. భారత్, పాక్ మీదుగా 3 వేల 180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మార్గమధ్యంలో ఈ నదిలోకి ప్రధానంగా ఆరు ఉపనదులు కూడా కలుస్తుంటాయి. దేశ విభజన అనంతరం సింధు జలాల నిర్వహణపై భారత్, పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం, ఇతర విషయాల్లో చాలా విషయాల్లో వివాదాలు వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ఆయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై ఇరువురు  సంతకాలు చేశారు. 

Also Read :  పెళ్లికెళ్తే చచ్చేంతపనైంది.. తేనెటీగల దాడిలో స్పాట్‌లోనే 50 మంది!

Also Read :  విడదల రజనికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట!

telugu-news | Jammu and Kashmir | india | Lashkar Chief Hafiz Saeed

Advertisment
Advertisment
Advertisment