Breaking: ఒకే ట్రాక్ పైకి దూసుకొచ్చిన మూడు రైళ్లు..తప్పిన పెను ప్రమాదం!

బాలాసోర్‌ రైలు ప్రమాదం గురించి ఇంకా ఎవరూ మర్చిపోకముందే మరో పెద్ద ప్రమాదం తప్పింది. ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్‌ సమీపంలో వందేభారత్‌ తో పాటు మరో రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఒకే ట్రాక్‌ పైకి వచ్చేశాయి.

New Update
Breaking: ఒకే ట్రాక్ పైకి దూసుకొచ్చిన మూడు రైళ్లు..తప్పిన పెను ప్రమాదం!

కొంత కాలం క్రితం ఒడిశాలోని బాలాసోర్‌ జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో మూడు రైళ్లు ఒకదానిని ఒకటి ఢీకొట్డడంతో వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆ ప్రమాదం గురించి ఇంకా చాలా మంది మరచిపోనే లేదు.

ఎన్నో కుటుంబాల్లో చేదు జ్ఙాపకాలను మిగిల్చింది ఆ ప్రమాదం. తాజాగా అదే ఒడిశాలో మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మూడు రైళ్లు ఒకే ట్రాక్‌ పైకి రావడం అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుందర్‌గఢ్‌ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం నాడు వందేభారత్‌ తో పాటు మరో రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఒకే ట్రాక్‌ పైకి వచ్చేశాయి.

ముందుగా సంబల్‌పూర్‌-రూర్కెలా మెము రైలు , రూర్కెలా- ఝార్పుగూడ పాసింజర్‌ రైలు ఒకే ట్రాక్‌ పై ఎదురెదురుగా వచ్చేశాయి. అయితే వెంటనే ఈ విషయాన్ని గమనించిన లోకోపైలట్లు అప్రమత్తం కావడంతో ఆ రెండూ 100 మీటర్ల దూరంలోనే ఆగిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.

సరిగ్గా అదే సమయంలో పూరి- రూర్కెలా మధ్య నడిచే సూపర్‌ ఫాస్ట్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా అదే ట్రాక్‌ పైకి దూసుకుని వచ్చింది. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే వందేభారత్ లోకోపైలట్‌ ను అప్రమత్తం చేశారు. దీంతో అది 200 మీటర్ల దూరంలో ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగాఈ మూడు రైళ్లు ఒకే ట్రాక్‌పై వచ్చినట్లు అధికార వర్గాలు భావిస్తున్నారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Also read: ఇంటర్ లో బయోలజీ చదవకున్నా డాక్టర్ కావొచ్చు.. స్టూడెంట్స్ కు మెడికల్ కమిషన్ గుడ్ న్యూస్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment