Health Tips : బీపీ ఉన్నవాళ్లు ఈ పండ్లను తింటే.. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ లాగా పనిచేస్తాయి..!!

అధిక రక్తపోటు లేదా తక్కువ రక్తపోటును నియంత్రించడం చాలా ముఖ్యం. సిట్రస్ పండ్లతోపాటు అరటిపండు, బెర్రీలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలో ఉన్న పోషకాలు బీపీని కంట్రోల్లో ఉంచుతాయని చెబుతున్నారు.

New Update
Health Tips : బీపీ ఉన్నవాళ్లు ఈ పండ్లను తింటే.. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ లాగా పనిచేస్తాయి..!!

Health Tips : ఈ రోజుల్లో, అధిక రక్తపోటు లేదా బిపి చాలా మంది ప్రజలలో దీర్ఘకాలిక, ప్రాణాంతక ఆరోగ్య సమస్యగా మారింది. అధిక ఒత్తిడి జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు.అధిక రక్తపోటు కనిపించినప్పుడు జీవనశైలిలో, ఆహారంలో కఠిన మార్పులు చేసుకుంటే ఈ వ్యాధిని సులువుగా అదుపులో ఉంచుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు.

జామకాయ:
పొటాషియం అధికంగా ఉండే సహజసిద్ధంగా లభించే పండ్లు రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ విషయంలో, జామకాయలో అధిక పొటాషియం కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ జామకాయను తినడం అలవాటు చేసుకుంటే హృదయ సంబంధ వ్యాధులు, పక్క గాలి, అధిక రక్తపోటు సమస్యలు దూరమవుతాయి.

సిట్రస్ పండ్లు :
విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లలో యాంటీఆక్సిడెంట్ ఎలిమెంట్స్ కారణంగా, ఇది రక్త నాళాలపై ఒత్తిడిని నియంత్రిస్తుంది. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.ప్రధానంగా అధిక రక్తపోటుతోపాటు గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. ఉదాహరణకు, జామ పండు, నారింజ, పుచ్చకాయ, బొప్పాయి, నిమ్మకాయ మొదలైనవి.

దానిమ్మ పండు :
దానిమ్మ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పాలీఫెనాల్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా ఉంది. ఇది అధిక రక్తపోటును నిర్వహించడానికి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది సరైన రక్త ప్రసరణను నిర్ధారిస్తుంది. గుండె సమస్యలను నివారిస్తుంది.
ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ గింజలను తీసుకోవడంతో పాటు దీని రసాన్ని తాగడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది.

అరటిపండు:
ఇప్పటికే అధిక రక్తపోటు వ్యాధితో బాధపడుతున్న వారు (ఈ వ్యాధి లేని వారు కూడా ఒకరోజు మధ్యాహ్న భోజనం తర్వాత పండిన అరటిపండు తినడం అలవాటు చేసుకుంటే మంచిది) ఈ పండును తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ పండులో ఉండే సహజ చక్కెర కంటెంట్, పొటాషియం కంటెంట్, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

బెర్రీలు:
రక్తపోటు వ్యాధితో బాధపడేవారు మితంగా బెర్రీలు తినడం అలవాటు చేసుకోవాలి. దీనికి ప్రధాన కారణం ఈ పండులో ఉండే ఫ్లేవనాయిడ్స్ అనే సహజ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఉదాహరణకు, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ పండ్లను తీసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: ఏపీలోని నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 6 నోటిఫికేషన్లు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.

Also read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.  

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్‌ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

telugu-news | rtv-news | national-news | Omar Abdullah 

Advertisment
Advertisment
Advertisment