YCP VS Pawan : మీ ఏడుపులే.. నాకు దీవెనలు .. పవన్ దెబ్బకు బూతుల మంత్రుల అడ్రస్ గల్లంతు

ప్యాకేజీ స్టార్, పావలా కల్యాణ్, షకీలా సాబ్.. పీకే గాడు..మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. అంటూ పవన్ కల్యాణ్ ను తిట్టిపోసిన వైపీసీ నేతలు ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పవన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్న వీరంతా ఓటమితో ముఖం చాటేసారు.

New Update
YCP VS Pawan : మీ ఏడుపులే.. నాకు దీవెనలు .. పవన్ దెబ్బకు బూతుల మంత్రుల అడ్రస్ గల్లంతు

YCP VS Pawan : జనసేనాని పవన్ కల్యాణ్ ఈనాటి గెలుపు వెనుక యుద్ధం ఉంది. ప్రతిరోజు ఓ పోరాటమే చేసారు. అధికార పక్ష నేతల మాటల దాడిని ఎదుర్కున్నారు. వ్యక్తిగత విమర్శలకు పోయి బూతులు తిడుతున్నా మౌనంగా భరించారు. అన్నిటికి కాలం సమాధానం చెబుతుంది అంటారు. పవన్ ని బూతులు తిట్టిన నేతలంతా పరాజయం పాలై గూటికి చేరుకున్నారు. తనని అంతలా ఇబ్బంది పెట్టిన ఆ నేతలకు పవన్ లెక్క తేల్చే టైమ్ మొదలైంది.

కొడాలి నాని..పవన్ కల్యాణ్ ను అనేకసార్లు ధూషించారు.  అనరాని మాటలు అన్నారు. పావలా పవన్, షకీలా సాబ్, దత్త పుత్రుడు.. చంద్రబాబుతో కలిస్తే పవన్ గుడ్డలూడదీస్తాం అంటూ అవాకులు, చవాకులు పేలారు.

https://rtvlive.com/is-ycp-gets-opposition-position-telugu/

పేర్ని నాని.. పవన్ ను తిట్టాలంటే ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. మా సన్నాసిగాడు.. పీకే గాడు.. ఆ పవన్ గాడు.. నువ్వు పోటుగాడివి ఏంట్రా.. పేకే సన్నాసి అంటూ పేట్రేగి పోయారు. ప్యాకేజ్ స్టార్ అంటూ పదే పదే మాట్లాడారు. ఇక మరో నేత అనిల్ కుమార్ యాదవ్ పవన్ బీమ్లా నాయక్ కాదని బిచ్చం నాయక్ అని విమర్శించారు. పీకే నువ్వేం పీకలేవు.. చంద్రబాబుని అనుసరిస్తున్న హచ్ డాగ్ అంటూ తిట్టిపోశారు. అసలు పవన్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని.. ఆయన ఎవరికీ అర్ధం కారని ఎద్దేవా చేసారు.

ఇక రోజా సంగతి చెప్పాలి చంద్రబాబుని పూనిన చంద్రముఖిలా పవన్ పిచ్చి గంతులు వేస్తున్నాడని.. జీవితంలో ఎమ్మెల్యేకాలేడని విమర్శించారు.సందు దొరికితే చాలు పవన్ ప్రస్తావన తెచ్చి తిట్టి పోశారు. ఇక పవన్ మూడు పెళ్లిళ్ల గురించి వైపీసీ నుంచి మాట్లాడని నేత లేరని చెప్పాలి. ప్రతి ఒక్కరూ పదే పదే పవన్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చి దుర్భాషలాడారు. పవన్ పై మాటల దాడి చేశారు. ఎవరేమన్నా పవన్ సీరియస్ గా తీసుకోలేదు. వారికి సున్నితంగానే సమాధానం చెబుతూ వచ్చారు. వారిని ఎదుర్కోవాలని ప్రయత్నించిన జనసైనికులను వద్దని వారించేవారు.

వైసీపీ నేతలు ఎన్ని మాటలు అన్నా.. పవన్ ఓర్పు వహించారు. సంయమనంతో ముందుకు సాగారు. వారి తిట్లు తనకు దీవెనలుగా భావించారు. ప్రతి ఒక్కరికి టైమ్ వస్తుంది. ఇప్పుడు పవన్ టర్న్ వచ్చింది. తనపై వ్యక్తిగత ధూషణలు చేసిన వైసీపీ నేతలు ఏపీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలయ్యారు. పవన్ ను నువ్వు ఏం పీకలేవు అన్న వారంతా ఇంటి దారి పట్టారు. పవన్ కి చెప్పు చూపించిన నేతలు ప్రజలకు తమ ముఖం ఎలా చూపిస్తారో చూడాలి.

https://rtvlive.com/celebrities-congratulate-pawan-kalyan-tweets-viral/

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  

New Update
Inter Supplementary Exams

Inter Supplementary Exams

Inter Supplementary Exams:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. కాగా ఇంటర్‌ ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత సాధించింది. గతం కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఆధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  


 Also Read :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
 
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా ఫేయిలై విద్యార్థులు సబ్జెక్టులను బట్టి  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి.  

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!


ఈరోజు (శనివారం) ఉదయం సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్  ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి అత్యధికంగా పాస్‌ పర్సంటేజ్ నమోదు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రతీఏడు లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా.. బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

Advertisment
Advertisment
Advertisment