Health Tips: మగవారికి పొంచిఉన్న ముప్పు..ఆ సమస్య తప్పదా..?

మగవారి పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి. జీవనశైలిలో మార్పులతో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్‌ ఇవ్వడం వల్ల ముప్పు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

New Update
Health Tips: మగవారికి పొంచిఉన్న ముప్పు..ఆ సమస్య తప్పదా..?

Prostate Cancer: మగవారి పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం సంవత్సరానికి 14 లక్షల మంది మగవారు క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. 3.75 లక్షల మంది చనిపోతున్నట్టు తేలింది. 2020 వరకు ప్రపంచంలో కేసులు, మరణాలపై డబ్ల్యూహెచ్‌వోలో (WHO) భాగంగా ఉన్న ఐఆర్‌సీ పరిశోధకులతో కలిసి అధ్యయనం జరిపింది. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు 2020 నుంచి 2040 మధ్య రెట్టింపు కంటే అధికం అవుతాయని అంచనా వేస్తున్నారు.

Prostate Cancer

ఇప్పుడు నమోదవుతున్న కేసుల కంటే మరో 85% పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అత్యధిక మరణాలు కూడా ఉంటాయని అంటున్నారు. 2040 వరకు సంవత్సరానికి 29 లక్షల ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఏడాదికి 7 లక్షల మంది మగవారు మరణిస్తారని అంటున్నారు. జీవనశైలిలో మార్పులతో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్‌ ఇవ్వడం వల్ల ముప్పు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
Prostate Cancer

ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..?

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ అనేది అధికంగా వయసు మీదపడిన వారిలోనే కనిపిస్తోంది. దీనికి నివారణ లేదు అయితే ముందస్తుగా కొన్ని పరీక్షలు చేయించుకుంటే చికిత్స చేసుకుని బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. 50 ఏళ్లు దాటిన వారు కచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ప్రొస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌ టెస్టులు (Prostate-Specific Antigen Test) చేయించుకోవాలి. 60 ఏళ్లు పైబడినవారిలో ఈ రిస్క్‌ బాగా ఎక్కువగా ఉంటుందని, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కడుపులో గడ్డలు ఉన్నట్టే..జాగ్రత్త

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raj Tarun: ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన యంగ్ హీరో..

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్'తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా టీజర్ విడుదలై ప్రమోషన్స్ షురూ అయ్యాయి. గత వివాదాల తర్వాత పెద్దగా కనిపించలేదు రాజ్, తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. 

New Update
Raj Tarun

Raj Tarun

Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పాలంటే, అతని స్టైల్ కొంచెం ప్రత్యేకమే. కేవలం సినిమా ప్రమోషనన్స్ టైమ్ లో మాత్రమే కనిపించి, తర్వాత పూర్తిగా మాయమవ్వడం అతని అలవాటుగా కనిపిస్తోంది. మూవీ రిలీజ్ టైమ్ లో తప్ప మిగతా రోజుల్లో  ఏమాత్రం అప్‌డేట్స్ లేకుండా మాయమయిపోతుంటాడు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రాజ్ తరుణ్ లాగానే అతని సినిమాలు కూడా అంతే త్వరగా మాయమవుతాయి. ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడో, టైటిల్ ఏంటి, ఎప్పుడు విడుదలవుతుందో ఇవేమి ఎవరికీ తేలేదు. సడన్ గా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు.

‘పాంచ్ మినార్’ ప్రమోషన్స్..

అయితే ఈ సారి కూడా అదే జరిగింది,  రాజ్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చాడు. ‘పాంచ్ మినార్’(Paanch Minar) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేసింది. ఇకపై సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను వరుసగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విడుదల కూడా త్వరలోనే ఉండబోతుందట.

Also Read: ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!

ఇదంతా పక్కనపెడితే, గతంలో రాజ్ తరుణ్ పై వచ్చిన వ్యక్తిగత వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. లావణ్య అనే మహిళ రాజ్ తరుణ్ తన భర్త అని మీడియా ముందుకొచ్చి సంచలనం సృష్టించింది. ఆ వివాదం పెద్ద చర్చకు దారితీసినా, చివరికి ఆమెనే మళ్లీ అతనికి క్షమాపణలు చెప్పింది. తన ఆరోపణలకు తానే క్లారిటీ ఇవ్వడంతో, రాజ్ తరుణ్ తిరిగి తెరపైకి వస్తాడని అందరూ భావించారు.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

అయితే ఆ వివాదం సద్దుమణిగాక  కూడా రాజ్ తరుణ్ మాత్రం మౌనం వీడలేదు, కావాలనే అజ్ఞాతం లోకి వెళ్ళాడో, లేదంటే ప్లాన్డ్ సైలెన్స్‌లో ఉన్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పుడు మరోసారి సినిమా విడుదల దశకు చేరుకోవడంతో మీడియా ముందుకొచ్చిన రాజ్ తరుణ్, సినిమా ప్రమోషన్స్ ముగిసిన తర్వాత మళ్లీ మాయమవుతాడా? అన్నది ప్రెశ్నగా మారింది.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

Advertisment
Advertisment
Advertisment