Vijayawada: బాబును చూడాలంటూ కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. చంద్రబాబు ఏం చేశారంటే!

కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబును కలిసేందుకు ఓ మహళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. అది గమనించిన బాబు మదనపల్లికి చెందిన నందినిని దగ్గరకు పిలిచి అప్యాయంగా పలకరించారు. అనారోగ్యంతో ఉన్న ఆమెకు అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

New Update
Vijayawada: బాబును చూడాలంటూ కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. చంద్రబాబు ఏం చేశారంటే!

AP News: ఈ రోజు కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా ఆయనకు స్వాగతం పలికారు. అయితే కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారు లోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ఆపి ఆమెను దగ్గరకు పిలిచి మాట్లాడారు.

publive-image

ఈ మేరకు తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పిన మహిళ.. చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చాను అని చెప్పింది. తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు ప్రేమగా మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. 'మా కష్టం ఫలించి.. మా కోరిక మేరకు మీరు సిఎం అయ్యారు సార్. ఒక్క సారి మీ కాళ్లు మొక్కుతా' అంటూ ఆ మహిళ కోరగా చంద్రబాబు సున్నితంగా వారించారు.

publive-image

ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడడాలని వచ్చానని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్లు అంటూ సూచించిన బాబు.. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు