నేడు రాజ్యసభకు ఢిల్లీ సర్వీసెస్ బిల్లు.... విప్ జారీ చేసిన ఆప్, ఇండియా కూటమి పార్టీలు...!

గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(సవరణ బిల్లు)- 2023ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ అధికారుల బదిలీలు, నియామకాలపై అధికారాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కట్టబెట్టేందుకు ఈ బిల్లు రూపొందించింది.

author-image
By G Ramu
New Update
Amit Shah: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతపై అమిత్ షా కీలక సమావేశం

Delhi Services Bill: గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(సవరణ బిల్లు)- 2023ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో (Rajya Sabha) ప్రవేశ పెట్టనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ అధికారుల బదిలీలు, నియామకాలపై అధికారాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కట్టబెట్టేందుకు ఈ బిల్లు రూపొందించింది. దీన్ని ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ అధికారుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు కట్టబెడుతూ ఈ ఏడాది మే 19న కేంద్రం ఒక ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చింది. ఇప్పుడు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశ పెట్టి చట్టంగా తీసుకు రావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఢిల్లీ సర్కార్ తీవ్రంగా ఫైర్ అయ్యింది. ఈ బిల్లును వ్యతిరేకించాలని, బిల్లును అడ్డుకునే విషయంలో పలు పార్టీల నేతలను కలుసుకుని వారి మద్దతును కేజ్రీవాల్ కోరుతున్నారు.

ఇటీవల విపక్ష ఎంపీల ఆందోళనల నడుమ ఈ బిల్లుకు లొక్ సభలో ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ సందర్భంగా ఆప్, విపక్షాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీకి సంబంధించిన చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కు ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా అదంతా కేవలం రాజకీయ పార్టీల దురుద్దేశంతోనేనన్నారు.

ఇక రాజ్యసభలో ఇవాళ ఈ బిల్లు ప్రవేశ పెట్టనుండటంతో ఆప్, కాంగ్రెస్, ఇతర పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఆయా పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. బిల్లు ప్రాధాన్యత దృష్ట్యా తమ పార్టీ సభ్యులు ఈ నెల 7,8 తేదీల్లో రాజ్యసభకు ఖచ్చితంగా హాజరు కావాలని ఆప్ విప్ జారీ చేసింది. ఇక సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇండియా కూటమి సభ్యులు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

టీవీకే అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు మరికొందరు పిటిషన్ వేసిన సంగతి తెలసిందే.

New Update
TVK Chief Vijay

TVK Chief Vijay

క్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ముస్లింలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు మరికొందరు పిటిషన్ వేసిన సంగతి తెలసిందే. తాజాగా విజయ్ కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

 ఇదిలాఉండగా.. వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలలైన పిటిషన్లపై ఏప్రిల్ 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై ఇప్పటిదాకా 10 పిటిషన్లు దాఖలయ్యాయి. మరికొన్ని త్రిసభ్య ధర్మాసనం ముందు జాబితా కావాల్సి ఉంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన బెంచ్ విచారణ చేయనుంది. 

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ముందుగా ఏప్రిల్ 15న విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం చెప్పగా.. కేంద్రం గత మంగళవారం కేవియట్ దాఖలు చేసింది. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని తెలిపింది. ఈ క్రమంలోనే వక్ఫ్ సవరణ చట్టంపై వచ్చిన పిటిషన్లను ఏప్రిల్ 16న విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇటీవల లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమ్మతితో ఈ చట్టం అమల్లోకి కూడా వచ్చింది.  

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

rtv-news | waqf-amendment-bill | national-news | telugu-news 

Advertisment
Advertisment
Advertisment