AP : మాజీ సీఎం జగన్ ఇలాకాలో ఆందోళన.. టీడీపీ, వైసీపీ మధ్య వార్..!

కడప జిల్లా పులివెందులలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. న్యాక్ బిల్డింగ్ సమీపంలో నివాసం ఉంటున్న వైసీపీ కార్యకర్త అబ్దుల్ ఇంట్లోకి చొరబడి టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. అడ్డొచ్చిన అబ్దుల్ మేనమామను సైతం తలపై కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
AP : మాజీ సీఎం జగన్ ఇలాకాలో ఆందోళన.. టీడీపీ, వైసీపీ మధ్య వార్..!

Kadapa : మాజీ సీఎం జగన్ (Ex. CM Jagan) ఇలాకాలో ఆందోళన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కడప జిల్లా పులివెందులలో (Pulivendula) టీడీపీ (TDP), వైసీపీ (YCP) కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. న్యాక్ బిల్డింగ్ సమీపంలోని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న వైసీపీ కార్యకర్త అబ్దుల్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి అందరినీ చితకొట్టారు.

Also Read: కుప్పంలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ నేతల రాళ్ళ దాడి.!

అడ్డొచ్చిన అబ్దుల్ మేనమామను తలపై కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైసీపీ సానుభూతిపరులమనే తమపై దాడి చేసారంటున్నారు బాధితులు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు