Yellow Alert: దేశంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. హైఅలెర్ట్ లో తెలంగాణ, ఏపీ, ఢిల్లీ!

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

New Update
Yellow Alert: దేశంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. హైఅలెర్ట్ లో తెలంగాణ, ఏపీ, ఢిల్లీ!

Temperatures Fallen Down: చలికాలం షురూ అయింది. దేశంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో చలి తన పంజా విసురుతోంది. ప్రజలు చలి పులికి గజగజ వణికిపోతున్నారు. చెద్దర్లు, స్వేటర్లకు గిరాకీ పెరిగింది. ఇదిలా ఉండగా ఇప్పటికే వాయు కాలుష్యంతో సతమతమవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు చలి తీవ్రత పెరగడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరి పిల్చికోవడానికి కూడా అక్కడి ప్రజలు నానాతంటాలు పడుతున్నారట. శ్వాసకోశ సమస్యతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. రోడ్లపై దట్టమైన పొగ మంచు కూరుకుపోవడంతో రాకపోకలకు అంతరం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సమయం 9 దాటినా సూర్యుడి జాడ కనిపించడం లేదు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.

ALSO READ: ‘భారత్ న్యాయయాత్ర’ పేరుతో రాహుల్ పాదయాత్ర

తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే సీన్...

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోనూ చలి కనికరం చూపడం లేదు. తెల్లారి లేచి ఎక్కడ చూసిన చలి మంటలతో కూర్చున్నా జనాలే దర్శనమిస్తున్నారు. చలి తీవ్రతతో పనులు మానుకొని చలి మంటల వద్ద ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఉదయంతో పాటు రాత్రి సమయాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తెలంగాణలో వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రమంతటా పొగమంచు వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వృద్ధులు, పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు తప్పకుండా ఇళ్లలోనే ఉండాలని పేర్కొన్నది. కాలుష్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గాలి నాణ్యత చాలావరకూ తగ్గిందని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టంచేసింది.

ALSO READ: ఓటుకు రూ.3,000.. మహిళలకు పట్టు చీర!

పొగమంచు ఎఫెక్ట్.. వాహనాలు ఢీ..

పొగమంచు కారణంగా విశాఖ కొమ్మాది కూడలిలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రైవేటు బస్సు, ట్యాంకర్‌, మూడు కార్లు ఢీకొని ప్రమాదం జరిగింది. అయితే.. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా కొమ్మాది కూడలిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: ముమ్మాటికి భద్రతా లోపమే.. అమిత్ షా, మోదీ రాజీనామా చేయాలి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

ఉగ్రదాడి ముమ్మాటికి భద్రత లోపమేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఫైర్ అయ్యారు. ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
 ys sharmila

ys sharmila

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి మనం దేశం మీద జరిగిన దాడి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిల అన్నారు. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని  ప్రధాని మోడీ ఒక క్యాంపెయిన్ నడిపారని.. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారని అన్నారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కశ్మీర్ కి వెళ్తుంటారన్నారు. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి భద్రత లోపమేనని ధ్వజమెత్తారు. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్లు లేనే లేరన్నారు. ప్రొటెక్షన్ కోసం ఉండే సెక్యూరిటీ కూడా లేదన్నారు. ఇంతమంది చనిపోయారు అంటే ప్రభుత్వ లోపమేనన్నారు. ఉగ్రవాదం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని అన్నారు. నేడు దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం పనిచేయడం లేదన్నారు. ఇండియా ఇంటలిజెన్స్ అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల మీద పనిచేస్తోందని ఆరోపించారు. 

మోదీకి అధికారంలో ఉండే హక్కు లేదు..

ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లకు అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. వీళ్ళు దేశానికి చౌకిదార్ కాదు..బీజేపీకి చౌకిదార్లని అన్నారు. ఈ దేశ దర్యాప్తు వ్యవస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్నారు. నిఘా వ్యవస్థ బలం అంతా ప్రధాని మోదీ కోసం పని చేస్తోందన్నారు. దేశ భద్రతను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి కేంద్రం తప్పిదమేనని ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారని.. దేశంలో ఉన్న ముస్లింలను చెడ్డవాళ్ళు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో మతం పేరుతో యుద్ధం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ దేశంలోనే ఇంటర్నల్‌గా భద్రత లేదన్నారు. అన్ని మతాలు సమానం అనే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. మోదీ శ్రమ దేశ భద్రత కోసం పెట్టి ఉంటే బయట వాళ్ళు చొరబడే పరిస్థితి లేదన్నారు.

Advertisment
Advertisment
Advertisment