House arrests: అనంతపురంలో టీడీపీ నేతల హౌస్ అరెస్టులు

ఏపీలో జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. నేడు ఉదయం నుంచే బంద్‌ నిరసన చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. మరోవైపు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.

New Update
House arrests: అనంతపురంలో టీడీపీ నేతల హౌస్ అరెస్టులు

ఏపీలో జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. నేడు ఉదయం నుంచే బంద్‌ నిరసన చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. మరోవైపు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పలు చోట్ల బంద్ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు.

బంద్‌కు పిలుపు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్టులు చేశారు. బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల వలయాన్ని తప్పించుకొని బయటకు నేతలు వస్తున్నారు. రోడ్డు మీదకు వస్తున్న నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు పోలీసులు. వెంకటాపురంలో మాజీ మంత్రి పరిటాల సునీతను ఉదయం నాలుగు గంటలకే హౌస్ అరెస్ట్ అయ్యారు. పోలీసుల వలయాన్ని తప్పించుకొని బయటికి వచ్చి.. కార్యకర్తలతో కలిసి వెంకటాపురం నుంచి ర్యాలీగా వెళ్లున్న పరిటాల సునీత. కదిరి ఆర్టీసీ డిపో వద్ద కందికుంట ప్రసాద్ ఆందోళనకు దిగిన్నారు. కళ్యాణదుర్గంలో ఆర్టీసీ డిపో వద్ద ఉమామహేశ్వర నాయుడు నిరసన చేపట్టారు. బస్సులు బయటికి రాకూడదంటూ ఆందోళనలు చేస్తున్నారు. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌ను హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం.

టీడీపీ నేతల అరెస్ట్

కడప జిల్లాలో బంద్‌ను భగ్నం చేశారు పోలీసులు. రోడ్డుపైకి వచ్చి బైఠాయించి వాహనాలను నిలుపదల చేసినందుకు టీడీపీ నేతల అరెస్ట్ అయ్యారు. కోటిరెడ్డి కూడలిలో టీడీపీ రాష్ట్ర నేతలు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డిల అరెస్ట్ చేశారు. పలువురు నేతలు గృహ నిర్భందాలు చేస్తున్నారు. మైదుకూరు, కడప, కమలాపురంలో టీడీపీ నేతలు పుట్టా సుధాకర్ యాదవ్, శ్రీనివాసుల రెడ్డి, పుత్తా నర్సింహారెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మొహరించారు. బద్వేల్, మైదుకూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వివాదం తోపులాట జరిగింది. అనంతరం యథావిధిగా బస్సు రాకపోకలు సాగిన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment