Tellam Venkata Rao : గర్భిణికి ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ ఆపదకాలమందు ఓ నిండు గర్భిణీకి పురుడు పోసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మంగళవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఓ గర్భిణికి సిజేరియన్ చేసి​ తల్లీబిడ్డలను కాపాడారు.

New Update
Tellam Venkata Rao : గర్భిణికి ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే

Bhadrachalam MLA Performed A Caesarean Section : భద్రాచలం (Bhadrachalam) ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ (Tellam Venkata Rao) ఆపదకాలమందు ఓ నిండు గర్భిణీకి పురుడు పోసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మంగళవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఓ గర్భిణికి సిజేరియన్ చేసి​ తల్లీబిడ్డలను కాపాడారు. వివరాల ప్రకారం.. దుమ్ముగూడెం మండలం డబ్ల్యూ రేగుబల్లికి చెందిన స్వప్న పురిటి నొప్పులతో సోమవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేరారు.

మంగళవారం నొప్పులు ఎక్కువ అవ్వడంతో కుటుంబ సభ్యులు డాక్టర్లను సంప్రదించడానికి ప్రయత్నించగా.. గైనకాలజిస్టు (Gynecologist) అందుబాటులో లేరు. దీంతో వారు ఎమ్మెల్యే వెంకట్రావుకు ఫోన్​ ద్వారా సమాచారాన్ని తెలియజేశారు. ఆయన హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి చేరుకుని.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రి స్టాఫ్​ కూడా ఎమ్మెల్యేకు పరిస్థితిని వివరించారు. దీంతో వెంటనే ఆయన స్వప్నను ఆపరేషన్​ థియేటర్​కు తరలించి సిజేరియన్ డెలివరీ​చేశారు. పండంటి మగబిడ్డను చూసి స్వప్న మురిసిపోయింది. ఎమ్మెల్యే వెంకట్రావుకు స్వప్నతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Also read: భారతీయ పురుషులకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదు..!



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?

రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్‌ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

New Update
Jammu Kashmir

Jammu Kashmir

రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్‌ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమైనట్లు అధికారులు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నిఘా వర్గాలు ఈ విషయాలను పసిగట్టినట్లు సమాచారం.

Also Read:BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

జమ్మూ కశ్మీర్‌ లో పని చేసే స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా అక్కడ పని చేస్తున్న రైల్వే ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లినవారే.దీంతో దాడుల ముప్పు దృష్ట్యా రైల్వే భద్రతా సిబ్బంది తమ బ్యారక్‌ ల నుంచి బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read: Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

మరోవైపు కశ్మీరీ పండిట్‌ల లక్ష్యంగా దాడులు చేసేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.వీరితో పాటు శ్రీనగర్‌,గాందెర్బల్‌ జిల్లాల్లోని పోలీసు సిబ్బందికి కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉదన్న వార్తల నేపథ్యంలో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి.

రైల్వే ప్రాజెక్టులను ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆర్పీఎఫ్‌ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

Also Read:Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

Also Read: Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?

jammu-kashmir | jammu kashmir attack | latest-news | latest-telugu-news | latest telugu news updates | attack in Pahalgam | Pahalgam attack | army

 

Advertisment
Advertisment
Advertisment