తగ్గేదే లే.. హైదరాబాద్ వాసులకు TGSRTC గుడ్ న్యూస్..!

TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఇంటివద్దకే కార్గో సేవలు అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముందుగా హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా రేపటి నుంచి ఈ హోం డెలివరీ సేవలు చేపట్టనున్నట్లు తెలిపారు.

New Update
tgsrtc

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలులోకి తెచ్చింది. అదే విధంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. అయితే ఇది అందరికీ అందలేదు. దీంతోపాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను కూడా అందిస్తోంది. అలాగే హామీలు మాత్రమే కాకుండా హైదరాబాద్‌లో మూసీనది సుందరీకరణ కోసం హైడ్రాను చేపట్టింది.

Also Read :  అన్న కోసం చాలా చేశా.. జగన్ నాకోసం ఏమీ చేయలేదు.. షర్మిల కంటతడి 

రాష్ట్రంలో హైవే రోడ్డు విస్తరణ కోసం ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కోట్లలో నిధులు మంజూరు చేసింది. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్డు విస్తరణ కోసం కొన్ని కోట్లు నిధులను విడుదల చేసింది. ఇలా ఒక్కొక్కటిగా చేస్తూ రేవంత్ సర్కార్ ముందుకు పోతుంది. ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read :  అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్

త‌మ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్ (కార్గో) సేవ‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ మ‌రింత‌గా విస్తరిస్తోంద‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్ అన్నారు. ఇందులో భాగంగానే హైద‌రాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా అత్యంత వేగ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. ఈ మేరకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also Read :  మా ఎమ్మెల్యేలకు ఎన్సీపీలో చేరాలని రూ. కోట్లు ఆఫర్ చేశారు: కాంగ్రెస్

రేపటి నుంచి (ఆదివారం) ఈ హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హైద‌రాబాద్‌లోని దాదాపు 31 ప్రాంతాల నుంచి ప్రారంభం కానున్నాయని అన్నారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్‌లో ఎక్కడికైనా హోం డెలివ‌రీ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంద‌ని చెప్పుకొచ్చారు. ప్రజ‌లంద‌రూ ఈ హోం డెలివ‌రీ సేవలను ఉప‌యోగించుకోవాల‌ని మంత్రి పొన్నం ప్రభాక‌ర్ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సేవలు విస్తరించనున్నట్లు మంత్రి చెప్పారు.

Also Read: Canada వెళ్లి చదువుకోవాలనుకునేవారు జాగ్రత్త.. భారత దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు

పార్శిళ్ల హోం డెలివ‌రీ చార్జీలు!

0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50
1.01నుంచి 5 కేజీల‌కు రూ.60
5.01 నుంచి 10 కేజీల‌కు రూ.65
10.1 నుంచి 20 కేజీల‌కు రూ.70
20.1 నుంచి 30 కేజీల‌కు రూ.75
30.1 కేజీలు దాటితే మరికాస్త అధిక ధ‌ర‌లు ఉంటాయి. అయితే ఈ హోం డెలివరీ సర్వీస్ వద్దనుకునే వారు బస్టాండ్‌కి వెళ్లి పార్శిళ్లు తీసుకోవచ్చు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టార్గెట్ హైదరాబాద్‌..  ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!

పహల్గామ్ ఉగ్రదాడి ఇప్పుడు దేశంలోని కొన్ని నగరాలకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు. ముఖ్యంగా ముంబై నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Hyderabad Skywalks4

Hyderabad

జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలోని కొన్ని నగరాలకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు. ముఖ్యంగా ముంబై నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెంటనే హైఅలర్ట్ జారీ చేశారు.

ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

ఈ నగరాల్లోనే..

ఉగ్రవాదుల ఎక్కువగా మెట్రో నగరాలు, జనాభా అధికంగా ఉన్న దగ్గర దాడులు చేస్తారు. గతంలో ముంబైలో వరుస పేలుళ్లు, హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబిని పార్క్, దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల వంటి ముష్కర దాడులను ఇంకా జనం మర్చిపోలేదు. ఈనేపథ్యంలోనే తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశమున్నట్లుగా అంచనా వేశారు.

ఇది కూడా చూడండి: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

ఇది కూడా చూడండి: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. స్టీల్ టిప్డ్ బుల్లెట్లు, AK-47 రైఫిళ్లు, బాడీ కెమెరాలు ధరించిన నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందం హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి జమ్మూ కాశ్మీర్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృతి చెందారు. 

Advertisment
Advertisment
Advertisment