రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. మార్పులు, చేర్పులకు గ్రీన్ సిగ్నల్

రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ అవకాశం కల్పిస్తోంది. కొత్తగా కుటుంబంలోకి పేర్లు చేర్చుకోవడానికి, ఉన్న పేర్లు తొలగించడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది.

New Update
Revanth 5

తెలంగాణ రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశం కల్పిస్తోంది. అలాగే కుటుంబంలోకి కొత్తగా పేర్లు చేర్చుకోవడానికి, ఉన్న పేర్లు తొలగించడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. గత కొన్నేళ్ల నుంచి తెలంగాణలో రేషన్ కార్డులు మంజూరు చేయలేదు.

ఇది కూడా చూడండి: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి

గత పదేళ్ల నుంచి..

దీనివల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. కొత్త రేషన్ కార్డులకు మంజూరు చేసి దాదాపుగా పదేళ్లు అయ్యాయి. ఈ పదేళ్లలో కొత్త కుటుంబాలు ఏర్పడం, భార్య, పిల్లలు ఇలా ఏర్పడ్డారు. కానీ రేషన్ కార్డుల్లో మార్పులు చేయడానికి మాత్రం అవకాశం రాలేదు. దీనివల్ల చాలా మంది సంక్షేమ పథకాలకు అర్హులు కాలేకపోవడం చాలా ఇబ్బందులు పడ్డారు. 

ఇది కూడా చూడండి:  ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’

రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేయాలనుకునే వారు మీసేవ సెంటర్‌కు వెళ్లాలి. ఇందులో పిల్లల పేర్లు యాడ్ చేయాలంటే వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపించాలి. లేదా ఆధార్ కార్డు అయిన తీసుకెళ్లాలి. వివాహమైన వారైతే భార్య పేరును రేషన్ కార్డులో యాడ్ చేయాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ద్వారా మార్పులు చేసుకోవచ్చు.

ఇది కూడా చూడండి: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల్లో డబ్బు అంటూ.. నిరుద్యోగ అబ్బాయిలే టార్గెట్

రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవడానికి మీసేవ సెంటర్ లో సాధారణ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీరు రేషన్ కార్డు ఆప్షన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. దీంతోపాటు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: TG Group-3: నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: సీఎం రేవంత్ కు షాకిచ్చిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు.. అలా చేశారేంటి?

నిన్న జరిగిన CLP భేటీకి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఈ ముగ్గురు.. ఎందుకు రాలేదన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

New Update

మంత్రివర్గ విస్తరణ అంశం తెలంగాణ కాంగ్రెస్ కు, సీఎం రేవంత్ కు తలనొప్పిగా మారింది. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న నేతలు స్వరం పెంచారు. తమను అడ్డుకుంటున్న వారిపై, హైకమాండ్ తీరుపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సారగ్ రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. వివేక్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ కు మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేబినెట్ విస్తరణలో తమకు చోటు కల్పించాలంటూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు సీఎల్పీ భేటీకి ఎందుకు హాజరు కాలేదనే అంశం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాయకత్వంపై అలిగే వీరు హాజరుకాలేదా? అన్న చర్చ సాగుతోంది. 

ఇదిలా ఉంటే.. నిన్నటి సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ విస్తరణపై పార్టీ నేతలు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. మంత్రివర్గం విస్తరణను అధిష్టానం చూసుకుంటుందన్నారు. పార్టీ లైన్‌ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisment
Advertisment
Advertisment