Politics: చంద్రబాబును కలిసిన నాగం.. మళ్లీ టీడీపీలోకి?

ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఈ రోజు అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో నాగం సొంత గూటికి చేరుతారా? అన్న చర్చ మొదలైంది. అయితే.. వీరి మధ్య అలాంటి అంశాలు చర్చకు రాలేదని తెలుస్తోంది.

New Update
Nagam Janardhan Reddy

Nagam Janardhan Reddy

తెలంగాణకు చెందిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబును అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. చాలా రోజుల తర్వాత కలిసిన నాగంను చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీతోనే రాజకీయ రంగప్రవేశం చేసిన నాగం జనార్దన్ రెడ్డి.. ఆ పార్టీలో అత్యంత కీలకంగా మారారు. ముఖ్యంగా దేవేందర్ గౌడ్ పార్టీని వీడిన తర్వాత దాదాపు నంబర్.2 స్థాయికి చేరుకున్నారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని వీడి తెలంగాణ నగారా సమితిని స్థాపించారు నాగం. అనంతరం బీజేపీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 
ఇది కూడా చదవండి: CM Revanth: ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

వైఎస్ సర్కార్ పై పోరాటం..

ఇదిలా ఉంటే.. 2004-2009 వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నాగం జనార్దన్ రెడ్డి వైఎస్ సర్కార్ పై తీవ్రంగా పోరాటం చేశారు. అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చుతూ ఇరుకున పెట్టేవారు. ముఖ్యంగా ఓబులాపురం మైనింగ్ పై తీవ్రంగా పోరాటం చేశారు. ఈ క్రమంలో నాగం జనార్దన్ తో పాటు ఆ సమయంలో టీడీపీలో ఉన్న అనేక మందిపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం జనార్దన్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా అవరావతిలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. 
ఇది కూడా చదవండి: పిచ్చికుక్కలకు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు.. కౌశిక్ రెడ్డి సంచలనం!

అయితే.. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నాగం మళ్లీ సొంత గూటికి చేరుతారా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. కానీ.. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని తెలుస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ladies Hostels : అర్థరాత్రి దొంగ హల్ చల్  లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి...

అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్నాడు ఓ దొంగ. అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

New Update
Girls Hostels

Girls Hostels

Ladies Hostels  : అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్న ఓ దొంగ వ్యవహారం మధురానగర్ లో చోటు చేసుకుంది.ఆ దొంగ అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్‌కు చెందిన సింధు(29) నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ.. మధురానగర్‌లోని శ్రీ సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో గత ఐదేళ్ల నుంచి ఉంటుంది. తన బ్యాగులో ల్యాప్‌టాప్, ఏటీఎం కార్డ్, ఆధార్ కార్డ్, మరికొన్ని సర్టిఫికెట్స్‌ను దాచుకుని నిద్రపోయింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో ఓ దొంగ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించాడు. బ్యాగును చోరి చేసి అక్కడి నుంచి ఉడాయించాడు.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

తెల్లారక చూసుకుంటే తన బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఏపీ మంగళగిరికి చెందిన యువతి కె.మనస్వి (24) నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ మధురానగ‌ర్‌లోని రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి హాస్టల్లోని రూమ్‌లో మనస్వి గాఢనిద్రలో ఉన్నప్పుడు ఓ దొంగ జొరబడ్డాడు. ల్యాప్ టాప్, ఛార్జర్, విలువైన వస్తువులను బ్యాగులో దాచుకుంది. మనస్వి నిద్రలోకి జారుకున్నాక ఆమె రూమ్‌లోకి దొంగ జొరబడి బ్యాగును అపహరించి పరారయ్యాడు.రెండు హాస్టళ్లలో చోరి చేసి బ్యాగులతో దొంగ ఉడాయించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఓ లేడీస్ హాస్టల్లో వాచ్‌మెన్ లేకపోవడం.. మరో హాస్టల్లో వాచ్‌మెన్ ఉన్నా అతను నిద్రపోవడంతో దొంగకు అడ్డంకులు లేకుండా పోయాయి. లాభాపేక్షతో హాస్టళ్లను నిర్వహిస్తూ భద్రతను గాలికొదిలేశారని బాధిత యువతులు వాపోయారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లేడీస్ హాస్టల్లో దూరింది దొంగా లేదా ప్రియుడా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఎందుకంటే బయటకొచ్చిన సీసీ ఫుటేజ్‌ను చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. హాస్టల్ లోపలికి వచ్చే డోర్ కాస్తా ఓపెన్ చేసి ఉంది.సాధారణంగా డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. లేదా ఓపెన్ చేసి ఉంటుంది. కానీ హాస్టల్ డోర్ కొంచెం మాత్రం ఓపెన్ అయిన ఉండటం వీడియోలో చూడవచ్చు. అలాగే లోపలికి వచ్చిన వ్యక్తి కూడా తన ఫేస్‌కు ఎలాంటి మాస్క్ ధరించలేదు. సాధారణంగా దొంగతనం చేసే వ్యక్తి, తన ఫేస్ కనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ఇక్కడ అలాంటిది ఏదీ కూడా జరిగినట్టు కనిపించడం లేదు. పైగా అతను గోడ దూకి వెళ్లినప్పుడు అతని దగ్గర ఉన్న బ్యాగ్ కూడా అంత బరువుగా ఉన్నట్టు కనిపించలేదు. దీంతో వచ్చింది అసలు దొంగనే అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఉన్న యువతి కోసం సదరు వ్యక్తి వచ్చి ఉండవచ్చనే అభిప్రాయాన్ని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

 
Advertisment
Advertisment
Advertisment