DHARANI: త్వరలో ముగియనున్న ధరణి కథ.. రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదే!

తెలంగాణలో ధరణి కథ ముగియనున్నట్లు తెలుస్తోంది. భూముల కొలతల విషయంలో శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వే అంశం, నక్షా ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రతి వ్యవసాయ క్షేత్రానికి నక్షా తప్పనిసరి ఉండేలా రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.

New Update
Dharani Portal: ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

DHARANI : భూ రికార్డుల విభాగాల పటిష్టతపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. భూ వివాదాలు ఉండకుండా ప్రతి వ్యవసాయ క్షేత్రానికి సర్వే నిర్వహించి నక్ష ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. సమగ్ర భూ సర్వేతోనే ఇది సాధ్య మవుతుందని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సర్వేతో భూ సమస్యలు ఇక ఉండవని, ధరణి సమస్యలు కూడా ఉండకుండా చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగానే ప్రతి వ్యవసాయ క్షేత్రాన్ని సర్వే చేసి నక్షలు రూపొందించి రైతులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Also Read : ఏఎస్ఐ నా పీక కోశాడు.. బ్లేడు గాట్లతో యువకుడి హల్ చల్!

ప్రతి వ్యవసాయ క్షేత్రానికి నక్షా తప్పనిసరి..

ధరణి సమస్యల పరిష్కారానికి, భూ వివాదాల తొలగింపునకు ప్రతి వ్యవసాయ క్షేత్రానికి తప్పనిసరిగా నక్షా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ధరణిలో అనేక అవకతవకలు జరిగాయని ఆర్వోఆర్-2024ను అమలులోకి తేవాలని యోచిస్తోంది. తాజాగా క్రయ విక్రయాలు జరిగే సమయంలో భూ నక్షా చిత్రం తప్పని సరిచేయాలని చూస్తోంది. ఈ క్రమంలో సర్వేయర్ల ఆవశ్యకత పెరిగింది. ఇప్పటివరకు వీరు పూర్తిస్థాయిలో లేకపోవడంతో గ్రామాల్లో భూ వివాదాలు పేరుకుపో యాయి. వీటి పరిష్కారానికి ధరణి వెబ్ సైట్లో చోటులేక వివాదస్పదంగా మారాయి. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే భూ రికార్డుల విభాగాల పటిష్టతపై కసరత్తు చేపట్టింది.  

Also Read :  ఇలాంటి బంగాళాదుంప తింటే ఏమవుతుందో తెలుసా..!అస్సలు ఊహించలేరు

రైతులను వేధిస్తున్న భూముల కొలతలు..

కొన్ని ప్రాంతాల్లో వ్యాప్తంగా సర్వేయర్ల కొరత కారణంగా భూముల కొలతలు రైతుల్ని వేధిస్తున్నాయి. వేల సంఖ్యలో కొలతల కోసం రైతులు అందజేసిన దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. సర్వేయర్ల కొరత ఉన్న చోట పక్క మండలాల వారికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీనికి తోడు ప్రభుత్వ పనులు అధికంగా ఉండటంతో దరఖాస్తులు పెండింగ్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రైతుల భూముల సర్వేలో జాప్యం ఏర్పడుతోందని పలువురు సర్వేయర్లు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: BIG BREAKING: కేటీఆర్ అరెస్టుకు డేట్‌ ఫిక్స్!

శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వే.. 

నిజాం పాలనలో సెత్వార్ పేరిట 1938-45 కాలంలో సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ గ్రామాల్లో పట్టాదారుల సమాచారంతో కాస్ట్రో-పహాణి తయారు చేసి అందుబాటులో ఉంచింది. ప్రభుత్వం ఏర్పడ్డాక వాటినే కొలమానంగా రెవెన్యూ శాఖ పరిగణించింది. సమస్య ఏర్పడినప్పుడు విక్రయాలు జరిగి వివాదాలు తలెత్తిన సమయంలో భూ కొలతలు శాఖ వద్ద ఉన్న టిప్పన్(కొలతల పుస్తకం) రూపంలో కొనుగోలుదారుకు భూమిని అప్పజెబుతూ వస్తున్నారు. రెవెన్యూ శాఖ వద్ద ఉన్న కాస్ట్రా పహాణి ఆధారంగానే భూ దస్త్రాల ప్రక్షాళన కొనసాగించారు. అయినా భూముల వివాదాలు అపరిష్కృతంగానే మిగులుతున్నాయి. వాటి శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వే అంశం, నక్షా ఆధారం గానే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుండటంతో సర్వేయర్ల ప్రాధాన్యత మరింత పెరిగింది.

ఇది కూడా చదవండి: Rashmika: ఫస్టాఫ్ అద్భుతం,సెకండాఫ్ అంతకు మించి.. రష్మిక పోస్ట్ వైరల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoist Operation: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్

సెంట్రల్ ఫోర్స్, పోలీసులు బచావో కర్రెగుట్టలు ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అడువులను ఆ రాష్ట్ర పోలీసులు, భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. తెలంగాణ సరిహద్దుగా ఉన్న కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్నారు.

New Update
maoist operation

మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్‌తో తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలు ఎరుపెక్కాయి. చత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులోని దండకార్యం అడవుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగం పీఎల్‌జీఏ లక్ష్యంగా పోలీసు బలగాలు బచావో కర్రెగుట్టలు ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అడువులను ఆ రాష్ట్ర పోలీసులు, భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి.  మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. సెంట్రల్ ఫోర్స్ ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం బీజాపుర్‌ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవుల్లోకి మూడు రోజులుగా దూసుకెళ్తున్నాయి. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు దాదాపు 100పైగా ఐఈడీలను నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది.

Also read: Army Encounter: ఆర్మీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ మృతి

 

బీజాపూర్ జిల్లా పూజారి కాంకేడ్ మీదుగా చొచ్చకెళ్తూ.. హిడ్మాను టార్గెట్ చేస్తూ మందుకు కదులుతున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో క్రమంగా మవోయిస్టులు పూర్తిగా పట్టుకోల్పోతున్నారు. కర్రెగుట్ట మీదుగా తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర, కేంద్ర బలగాలు కర్రెగుట్టలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయి. కర్రెగుట్టల ఆపరేషన్‌తో మాకు సంబంధం లేదని తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Also read: Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

తెలంగాణ వైపు ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌ వైపు బీజాపుర్‌ జిల్లా ఊసూరు బ్లాక్‌ సరిహద్దులుగా సుమారు 90 కి.మీ. పొడవున గొలుసుకట్టుగా ఈ కొండలు విస్తరించి ఉన్నాయి. సముద్ర మట్టానికి సుమారు 9 వేల అడుగుల ఎత్తులో ఉండటంతోపాటు వీటిపైన దాదాపు 10-15 కి.మీ. మేర విస్తీర్ణం ఉండటంతో కొన్నేళ్లుగా మావోయిస్టులు స్థావరంగా మార్చుకున్నారు. సుమారు 1000 మంది పీఎల్‌జీఏ సభ్యులు ఇక్కడే ఉన్నట్లు నిఘావర్గాల సమాచారం. కేంద్ర కమిటీ అగ్రనాయకులు హిడ్మా, దేవ, వికాస్, దామోదర్‌ వంటి వారూ ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుమారు 3 వేల మంది బలగాలు ఈ ఆపరేషన్‌లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. 

(maoist | telanagan | dandakaranyam | maoist commander hidma | Chattisgarh Naxal Attack | chattisghad | chattisgarh border | telugu-latest-news | Maoist Operation | Anti-Maoist Operation)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు