Suryapet Murder: సూర్యాపేటలో మాజీ సర్పంచ్ మర్డర్.. డీఎస్పీతో పాటు ఆ పోలీసులందరిపై వేటు!

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ మాజీ సర్పంచ్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ శ్రీనివాస్ నాయక్ పై పోలీస్ శాఖ బదిలీ వేటు వేసింది. ఎస్ఐకి మెమో జారీ చేసింది.

New Update
Suryapet Murder

Suryapet Murder

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ మాజీ సర్పంచ్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ శ్రీనివాస్ నాయక్ పై పోలీస్ శాఖ బదిలీ వేటు వేసింది. ఎస్ఐకి మెమో జారీ చేసింది. చక్రయ్య గౌడ్ పై దాడి జరిగే అవకాశం ఉందని ముందుగానే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినా దాడులు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో సీఐని ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేయగా.. డీఎస్పీని డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. ఈ మేరకు మల్టీజోన్‌–2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. 

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో ఈ నెల 17న కాంగ్రెస్ నేత చక్రయ్య గౌడ్ కలకలం రేపింది. గ్రామంలో రాజకీయ ఆధిపత్యం, వర్గ విభేదాలే చక్రయ్య గౌడ్ హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. నిందితలను ఇటీవల పట్టుకున్న పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సొంత కూతురు, అల్లుడే ప్రధాన నిందితులుగా గుర్తించారు. మొత్తం 13 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు.

నిందితులకు పోలీసుల సహకారం..?

అయితే.. ఈ హత్య విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు సీరియస్ గా తీసుకున్నారు. అసెంబ్లీలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కానీ పోలీసులు మాత్రం నిందితులకు సహాకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన నిందితులు కోర్టులో లొంగిపోవడానికి పోలీసులు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం లక్షల రూపాయలు చేతులు మారాయని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించి.. ఆందోళనలకు సైతం దిగారు. ఈ నేపథ్యంలోనే పలువురు పోలీసు అధికారులపై వేటు పడిందని తెలుస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment