TG MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందుకే ఓడాం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకటయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామన్నారు. అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో BRS చెప్పాలన్నారు.

New Update
TG MLC Elections 2024

TG MLC Elections 2024

కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లోనే బీజేపీతో బీఆర్ఎస్ మమేకం అయ్యిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అలానే వ్యవహరించదని ఆరోపించారు. బీఆర్ఎస్ తరఫున ఈ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టలేదన్నారు. రవీందర్ సింగ్ కు వ్యక్తిగతంగా ఓట్లు వచ్చాయన్నారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ రద్దు.. సీఎం రేవంత్ కు హైకోర్టు బిగ్ షాక్!

బీఆర్ఎస్, బీజేపీది ఫెవికల్ బంధం

పరోక్షంగా రవీందర్ సింగ్ ను బీఆర్ఎస్ బలపరిస్తే పరిస్థితి ఇంకోలా ఉండేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికల్ బంధమన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకటయ్యాయని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో సూటిగా చెప్పాలని బీఆర్ఎస్ పార్టీని శ్రీధర్ బాబు నిలదీశారు. బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 
ఇది కూడా చదవండి: PM Modi : MLC ఎన్నికలపై ప్రధాని మోదీ ట్వీట్.. ఏమన్నారంటే?

కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ సైతం ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ను బీజేపీ ఎలా లొంగదీసుకుందో ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టం అయిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనన్నారు. ఆ రెండు పార్టీలను వేరువేరుగా చూడడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. బీజేపీ ఓట్ల కోసం.. ఎన్నికల కోసం పోరాడుతోందన్నారు. ఆ పార్టీ ప్రజల కోసం ఎప్పుడూ పోరాటం చేయదన్నారు. ఉప ఎన్నికలు వస్తే సత్తా చటుతాం అనే బీఆర్ఎస్.. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్క చోట కూడా ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై పోరాటం చేసి.. బీజేపీకి ఓట్లు వేయించిందన్నారు. 

కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడం తెలంగాణ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. రాష్ట్రంలో తమకు తిరుగు లేదని బీజేపీ నేతలు చెబుతుండగా.. బీఆర్ఎస్ సపోర్ట్ తోనే బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసినా ఓటర్ల మద్దతు లభించలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Yashaswini Reddy : ఎర్రబెల్లి నీకు సినిమా చూపిస్తా.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాస్ వార్నింగ్!

మాజీ మంత్రి ఎర్రబెల్లి వయస్సుతో పాటు హుందాతనాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ సత్తా ఏంటో లోకల్ బాడీ ఎన్నికల్లో చూపిస్తామని అన్నారు. ఇప్పుడే కాదు తెలంగాణలో మరోసారి రాబోయేది కూడా కాంగ్రెస్ సర్కారే అంటూ ధీమా వ్యక్తం చేశారు

New Update

పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి విషయంలో తనకో విజన్ ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన అనుకున్న టైమ్ లోపు అన్ని పనులు జరుగుతాయని తేల్చి చెప్పారు.   బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు.  అమ్మాయి చిన్నగా ఉంది.. సాఫ్ట్ గా ఉందని అనుకుంటే అది మీ తప్పే అని అన్నారు.  ఇంకోసారి అత్తాకోడళ్ళు అని ఇష్టమోచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదని..  మీకు అంతా ఇంట్రెస్ట్ ఉంటే అత్తా-కోడళ్ళ సినిమా, సీరియల్ తాను చూపిస్తానని హెచ్చరించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వయస్సుతో పాటు హుందాతనాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. ఏదీ పడితే మాట్లాడితే బాగుండదన్నారు. కాంగ్రెస్ సత్తా ఏంటో లోకల్ బాడీ ఎన్నికల్లో చూపిస్తామని అన్నారు. ఇప్పుడే కాదు తెలంగాణలో మరోసారి రాబోయేది కూడా కాంగ్రెస్ సర్కారే అంటూ ధీమా వ్యక్తం చేశారు.  ఏడాది పాలనకే ఇంత ఫ్రస్టేషన్ కు లోనైతే మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం అయిపోతారో.. ఆరోగ్యాలు చూసుకోవాలంటూ మాస్ వార్ని్ంగ్ ఇచ్చారు. 

ఎర్రబెల్లి బస్తిమే సవాల్

అంతకుముందు రేవంత్ సర్కార్‌ పై మాజీ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ పూర్తి కాగానే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని అన్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చీఫ్ గెస్టుగా పాల్గొని మాట్లాడారు.  స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం భయపడుతుందని అన్నారు.  రాసిపెట్టుకోండి.. స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడ్.. ఎప్పుడు ఎన్నికలు పెట్టిన సరే..  బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమని ఎర్రబెల్లి అన్నారు. సర్వేలన్ని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయన్న  ఎర్రబెల్లి..  ఎన్నికలు పెట్టి చూడండి .. తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు.  తాను చెప్పింది నిజం కాకపోతే  రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎర్రబెల్లి సవాల్ విసిరారు.  మొత్తం రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. అందులో కేవలం 10 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్‌గా ఉందని..  మిగతా చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడుతోందని ఎర్రబెల్లి  స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
Advertisment