Ponguleti: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా?

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్లుగా నిన్న పొలిటికల్ బాంబ్ పేలుతుందని అంతా భావించారు. కానీ నిన్న అలాంటి ప్రకటన ఏమీ రాలేదు. దీంతో మంత్రి పొలిటికల్ బాంబ్ ఏమైందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.

New Update
Ponguleti Srinivas

సియోల్ నుంచి మనం పోయిన తర్వాతనో.. లేదా ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో ఒకటో, రెండో పొలిటికల్ బాంబులు పేలుతాయి.. ఇటీవల దక్షిణ కొరియా టూర్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పిన మాటలివి. ఈ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనంగా మారాయి. నిన్న మంత్రి వర్గ సమావేశం నేపథ్యంలో ఈ కామెంట్స్ పై జోరుగా చర్చ సాగింది. మంత్రి వర్గ సమావేశం తర్వాత నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇందుకు సంబంధించి ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో మంత్రి చెప్పిన పొలిటికల్ బాంబులు పేలలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్లు తదితర అంశాలపై ప్రస్తుత రేవంత్ సర్కార్ విచారణ చేస్తోంది.

ఇది కూడా చదవండి: 39 కానిస్టేబుళ్లపై సస్పెండ్ వేటు.. ఏక్ పోలీస్ విధానం అంటే ఏంటి ?

కాళేశ్వరంపై చర్యలు ఉంటాయని ప్రచారం..

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని.. బీఆర్ఎస్ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని కాంగ్రెస్ నేతలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నాటి నుంచి వారు ఈ ఆరోపణలు తీవ్రతరం చేశారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరైన అధికారులు సైతం తాము కేసీఆర్ చెప్పినట్లే చేశామని స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్ పై చర్యలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. 

ఇది కూడా చదవండి: కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టు చేపడుతున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చర్యలు?

ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సైతం తుది దశకు చేరుకుందని.. ఈ విషయంలోనూ చర్యలు ఉంటాయన్న ప్రచారం సాగింది. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకే వారి రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేశారని కాంగ్రెస్ నేతలు అనేక సార్లు ఆరోపించారు. దీంతో వారిపై చర్యలు ఉంటాయని అంతా భావించారు. మరో వైపు ధరణికి సంబంధించి సైతం గత బీఆర్ఎస్ సర్కార్ పై కాంగ్రెస్ అనేక సార్లు ఆరోపణలు చేసింది. ఈ విషయమై కూడా ఇంత వరకు చర్యలు చేపట్టలేదు. నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత కూడా ఈ అంశంపై ఎలాంటి ప్రకటన రాలేదు. 

Also Read :  వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

మంత్రి బాంబులు ఎందుకు పేలలేదు?

అయితే.. మంత్రి చెప్పినట్లుగా పొంగులేటి బాంబులు ఎందుకు పేలలేదన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అయితే.. ప్రభుత్వం ఆచితూచి ముందుకు వెళ్లాలని భావిస్తోందన్న చర్చ నడుస్తోంది. అన్ని ఆధారాలతోనే చర్యలు ఉంటాయని.. తొందరపడి ముందుకు వెళ్లొద్దన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న మంత్రి ప్రకటన లేదన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే.. నిన్న ప్రెస్ మీట్ సమయంలో మంత్రి పొంగులేటి ఈ విషయంపై ప్రస్తావించారు. దీపావళి పటాసుల కన్నా ముందే రాజకీయ బాంబు పేలుతుందని స్పష్టం చేశారు. దీంతో మంత్రి చెప్పినట్లుగా దీపావళిలోగా అయినా బాంబులు పేలుతాయా? లేదా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Also Read :  ఆ విషయంలో కార్తీని చూస్తే అసూయగా ఉంటుంది.. సూర్య షాకింగ్ కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ladies Hostels : అర్థరాత్రి దొంగ హల్ చల్  లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి...

అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్నాడు ఓ దొంగ. అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

New Update
Girls Hostels

Girls Hostels

Ladies Hostels  : అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్న ఓ దొంగ వ్యవహారం మధురానగర్ లో చోటు చేసుకుంది.ఆ దొంగ అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్‌కు చెందిన సింధు(29) నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ.. మధురానగర్‌లోని శ్రీ సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో గత ఐదేళ్ల నుంచి ఉంటుంది. తన బ్యాగులో ల్యాప్‌టాప్, ఏటీఎం కార్డ్, ఆధార్ కార్డ్, మరికొన్ని సర్టిఫికెట్స్‌ను దాచుకుని నిద్రపోయింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో ఓ దొంగ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించాడు. బ్యాగును చోరి చేసి అక్కడి నుంచి ఉడాయించాడు.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

తెల్లారక చూసుకుంటే తన బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఏపీ మంగళగిరికి చెందిన యువతి కె.మనస్వి (24) నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ మధురానగ‌ర్‌లోని రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి హాస్టల్లోని రూమ్‌లో మనస్వి గాఢనిద్రలో ఉన్నప్పుడు ఓ దొంగ జొరబడ్డాడు. ల్యాప్ టాప్, ఛార్జర్, విలువైన వస్తువులను బ్యాగులో దాచుకుంది. మనస్వి నిద్రలోకి జారుకున్నాక ఆమె రూమ్‌లోకి దొంగ జొరబడి బ్యాగును అపహరించి పరారయ్యాడు.రెండు హాస్టళ్లలో చోరి చేసి బ్యాగులతో దొంగ ఉడాయించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఓ లేడీస్ హాస్టల్లో వాచ్‌మెన్ లేకపోవడం.. మరో హాస్టల్లో వాచ్‌మెన్ ఉన్నా అతను నిద్రపోవడంతో దొంగకు అడ్డంకులు లేకుండా పోయాయి. లాభాపేక్షతో హాస్టళ్లను నిర్వహిస్తూ భద్రతను గాలికొదిలేశారని బాధిత యువతులు వాపోయారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లేడీస్ హాస్టల్లో దూరింది దొంగా లేదా ప్రియుడా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఎందుకంటే బయటకొచ్చిన సీసీ ఫుటేజ్‌ను చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. హాస్టల్ లోపలికి వచ్చే డోర్ కాస్తా ఓపెన్ చేసి ఉంది.సాధారణంగా డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. లేదా ఓపెన్ చేసి ఉంటుంది. కానీ హాస్టల్ డోర్ కొంచెం మాత్రం ఓపెన్ అయిన ఉండటం వీడియోలో చూడవచ్చు. అలాగే లోపలికి వచ్చిన వ్యక్తి కూడా తన ఫేస్‌కు ఎలాంటి మాస్క్ ధరించలేదు. సాధారణంగా దొంగతనం చేసే వ్యక్తి, తన ఫేస్ కనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ఇక్కడ అలాంటిది ఏదీ కూడా జరిగినట్టు కనిపించడం లేదు. పైగా అతను గోడ దూకి వెళ్లినప్పుడు అతని దగ్గర ఉన్న బ్యాగ్ కూడా అంత బరువుగా ఉన్నట్టు కనిపించలేదు. దీంతో వచ్చింది అసలు దొంగనే అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఉన్న యువతి కోసం సదరు వ్యక్తి వచ్చి ఉండవచ్చనే అభిప్రాయాన్ని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

 
Advertisment
Advertisment
Advertisment