కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?: కోమటిరెడ్డి సంచలన ఇంటర్వ్యూ

కేసీఆర్ పేరు తెలంగాణలో ఎక్కడా వినపడడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసలు ఆయన ఫామ్ హౌజ్ లో కూడా ఉన్నాడా? లేడా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. BRS నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నా తామే వద్దంటున్నామన్నారు.

New Update

ఏడాది తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పని తీరే ఇందుకు కారణమన్నారు. కేసీఆర్ పేరు ఇప్పుడు తెలంగాణలో ఎక్కడా వినపడడం లేదన్నారు. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క ఐదుగురు ఎమ్మెల్యేలతో పోరాటం చేశారన్నారు. అసలు కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఉన్నాడా? లేడా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

మాతో టచ్ లో 20 మంది ఎమ్మెల్యేలు..

ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు టచ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కోమటిరెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ నుంచి మరో 20 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ తామే వద్దంటున్నామన్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కోమటిరెడ్డి RTVతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను పై వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Smita Sabharwal : HCU భూముల వ్యవహారం.. స్మితా సబర్వాల్‌కు సీఎం రేవంత్‌ సర్కార్ బిగ్‌ షాక్‌

స్మితా సభర్వాల్ కు పోలీసులు బిగ్ షాకిచ్చారు.  కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఆమెకు నోటీసులు పంపించారు. సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన ఫేక్ ఫోటోను ఆమె షేర్ చేశారు.

New Update
snmitha ias

snmitha ias

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ కు పోలీసులు బిగ్ షాకిచ్చారు.  కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఆమెకు నోటీసులు పంపించారు.  సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన ఫేక్ ఫోటోను ఆమె షేర్ చేయడమే ఇందుకు కారణం. 2025 మార్చి 31వ తేదీన  ‘Hi Hyderabad’ అని ఎక్స్ వేదికగా షేర్ చేయబడింది. ఇది మష్రూమ్ రాక్ వద్ద బుల్‌డోజర్లు, వాటిని చూస్తున్న నెమలి, జింక లాంటి జంతువులతో జిబ్లి స్టైల్‌లో రూపొందించబడినదిగా ఉంది. 

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ఏఐ వీడియోలు, చిత్రాల ద్వారా సోషల్ మీడియాలో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని, వీరి వెనుక ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రభుత్వానికి నిఘా వర్గాలు నుంచి సమాచారం అందింది. ఈ క్రమంలో ఫేక్ ప్రచారానికి పాల్పడిన ఆయా యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఎక్స్ వేదికగా  స్మితా సబర్వాల్ చేసిన రీ పోస్టుకు గానూ పోలీసులు నోటీసులు అందించారు. 

Also read:   ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి ఇదేం పనిరా.. మహిళకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దారుణం

Advertisment
Advertisment
Advertisment