ఏం చేద్దాం నాన్నా.. కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ!

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ, ఈడీ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు కేసీఆర్ ను ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో కలిశారు. జరుగుతున్న పరిణామాలను, నిన్న విచారణ జరిగిన తీరును వివరించారు. ఈ సమావేశంలో కేటీఆర్ తో పాటు హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.

New Update

ఏసీబీ, ఈడీ విచారణల నేపథ్యంలో ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో హరీశ్‌ రావు సైతం పాల్గొన్నారు. ఏసీబీ విచారణ, కేటీఆర్ అరెస్ట్ ఉంటుందన్న ఊహాగానాలు, తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నిన్నటి ఏసీబీ విచారణ జరిగిన తీరును కేసీఆర్ కు కేటీఆర్ వివరించినట్లు సమాచారం. ఈడీ, ఏసీబీ విచారణలో నేపథ్యంలో కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, ప్రభుత్వంపై పోరాటం తదితర అంశాలపై సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CM Revanth: ఇందిరమ్మ ఇళ్లకు ఫ్రీగా ఇసుక సరఫరా: సీఎం రేవంత్‌

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఫ్రీగా ఇసుకను సరఫరా చేయాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుల లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

New Update
cm revanth reddy

cm revanth reddy

తెలంగాణలో ఇసుక రవాణా, తవ్వకాల అంశంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఫ్రీగా ఇసుకను సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుల లభించేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. సోమవారం గనుల ఖనిజాభివృద్ధిపై ఆయన సమీక్ష సమావేశం జరిపారు.  

Also Read: బీఈడీ చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి ఒక ఏడాదే కోర్సు

ఈ సందర్భంగా అధికారులకు పలు అంశాలను దిశానిర్దేశం చేశారు. '' రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి. పేద ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచాలి. ఇసుక మాఫియాపై అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇసుక రీచ్‌ల వద్ద అధికారులు తనిఖీ చేపట్టాలి. ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే ఎంతటి వాళ్లనైనా విడిచిపెట్టేది లేదు. ఇసుక రవాణా పర్యవేక్షణ కోసం స్పెషల్ ఆఫీసర్లను నియమించాలి.    

Also Read: మతిపోగొడుతున్న ఏయిర్‌ షో.. అత్యాధునిక యుద్ధ విమానాల ప్రదర్శన

ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూసే బాధ్యతను జిల్లా కలెక్టర్లు.. ఎస్పీలకు ఇవ్వాలి. అలాగే హైదరాబాద్‌లో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే బాధ్యత హైడ్రాకు అప్పజెప్పాలి. అన్నీ ఇసుక రీచ్‌ల వద్ద కెమెరాలు, సోలార్‌ లైట్లను ఏర్పాటు చేయాలి. ఇసక స్టాక్ యార్డుల వద్ద కూడా కట్టుదిట్టమైన ఫెన్సింగ్‌ను వేయాలి. వినియోగదారుడు ఇసుకను బుక్‌ చేసిన 48 గంటల్లోనే అతడికి ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని'' సీఎం రేవంత్ ఆదేశించారు. ఇదిలాఉండగా.. రాష్ట్రంలో సొంత స్థలాలు ఉన్నవాళ్లకి ఇళ్ల నిర్మాణం కోసం మొదటి విడుతలో ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తోంది. 

Also Read: షాకింగ్ న్యూస్.. డ్రగ్స్ పెంచి పోషించిన ప్రధాని.. 50 వేల మంది మృతి!

Advertisment
Advertisment