ఏసీబీ, ఈడీ విచారణల నేపథ్యంలో ఎర్రవెల్లి ఫాంహౌస్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో హరీశ్ రావు సైతం పాల్గొన్నారు. ఏసీబీ విచారణ, కేటీఆర్ అరెస్ట్ ఉంటుందన్న ఊహాగానాలు, తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నిన్నటి ఏసీబీ విచారణ జరిగిన తీరును కేసీఆర్ కు కేటీఆర్ వివరించినట్లు సమాచారం. ఈడీ, ఏసీబీ విచారణలో నేపథ్యంలో కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, ప్రభుత్వంపై పోరాటం తదితర అంశాలపై సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏం చేద్దాం నాన్నా.. కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ!
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ, ఈడీ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు కేసీఆర్ ను ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో కలిశారు. జరుగుతున్న పరిణామాలను, నిన్న విచారణ జరిగిన తీరును వివరించారు. ఈ సమావేశంలో కేటీఆర్ తో పాటు హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.