GROUP 1 Mains : గ్రూప్ -1 మెయిన్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ గ్రూప్ -1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. మెయిన్స్ పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి

New Update
Telangana High Court: ఆ విషయంలో పోలీసులు తీరు మార్చుకోవాలి: హైకోర్టు

Group 1 Exam : తెలంగాణలోని గ్రూప్ - 1 అభ్యర్థులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇటీవల జరిగిన గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని దాఖలైన రెండు పిటిషన్ల పై ధర్మసనం విచారణ చేపట్టింది. ఆ రెండు పిటిషన్లను కొట్టేసింది. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే పలుమార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దు అయిన సంగతి తెలిసిందే. కొందరు విద్యార్థులు పరీక్ష రద్దు కావడంతో తమ ప్రాణాలు తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: మహా ఎన్నికలకు మోగనున్న నగారా!

హాల్ టికెట్స్ విడుదల....

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు https://hallticket.tspsc.gov.in/h022024d08f5d90-6aaa-4360-acb2-046f588e3284 లింక్ పై క్లిక్ చేసి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గ్రూప్-1 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ (TGPSC Group-1) విడుదల చేసింది. మొత్తం 563 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. జూన్ 9న ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మంది హాజరు కాగా.. 31,382 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు.

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

ఈ నెల 21 నుంచి...

వీరందిరికీ ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ నిర్వహించనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మెయిన్స్ పరీక్షకు మొత్తం 6 పేపర్లు ఉండనున్నాయి. ప్రతీ పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనుంది టీజీపీఎస్సీ. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. కేవలం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రమే ఈ పరీక్ష ను నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి... ఆరోజే కీలక ప్రకటన!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment