Hydra: హైడ్రాకు హైకోర్టు బిగ్ రిలీఫ్

TG: హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటు జీవో 99, హైడ్రా చర్యలను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది.

New Update
HYDRA on Musi

Telangana HYDRA: హైదరాబాద్ లో చెరువులు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు రేవంత్ సర్కార్ హైడ్రా ను ఏర్పాటు చేసింది. కాగా సీఎం రేవంత్ (CM Revanth Reddy) తీసుకున్న ఈ నిర్ణయం పై ఒకవైపు ప్రసంశలు వస్తున్న మరోవైపు విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. ఈ హైడ్రా అంశం హైకోర్టుకు చేరింది. హైడ్రాను వ్యతిరేకించేవారు, హైడ్రా బాధితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని పిటిషన్ దారులు హైడ్రా కార్యాచరణకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు.

ఇది కూడా చదవండి: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్... రేపు కీలక ప్రకటన!

హైడ్రాకు బిగ్ రిలీఫ్... 

హైడ్రాకు బిగ్ రిలీఫ్ దొరికింది. హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటు జీవో 99, హైడ్రా చర్యలను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది. 

ఇది కూడా చదవండి: నేడు కోర్టుకు సీఎం రేవంత్..కానీ!

నిజం కాలం నాటి రెవెన్యూ చట్టం ప్రకారం ఏ రెవెన్యూ అధికారి అయినా, ఎప్పుడైనా సర్వే చేయవచ్చునని తెలిపింది. ఈ వ్యవహారాల పర్యవేక్షణకు అధికారిని నియమించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉందని చెప్పింది. ఈ క్రమంలోనే హైడ్రా ఏర్పాటు జరిగిందని పేర్కొంది. నిజాం కాలం నాటి రెవెన్యూ చట్టం ప్రకారం నోటీసు కూడా జారీ చేయాల్సిన అవసరం లేదని, FTL, బఫర్‌‌‌‌‌‌‌‌ జోన్లలో సర్వే చేసి అక్కడ ఉండే నిర్మాణాలు, ఆక్రమణలను కూల్చివేసే అధికారం ఉంటుందని హైడ్రా కు మద్దతుగా తన అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. ఆనాటి రెవెన్యూ చట్టానికి అనుగుణంగానే ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ చట్టం కూడా రూపొందిందని హైకోర్టు వివరించింది. FTL, బఫర్‌‌‌‌‌‌‌‌జోన్ల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఒక కేసులో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించిందని గుర్తు చేసింది.

ఇది కూడా చదవండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్!

29కి వాయిదా...

మూసీ ప్రాంతంలోని (Musi River) తమ ఇళ్లపై ఎర్రని అక్షరాలతో RBX మార్కింగ్‌ వేశారని.. ఏ క్షణమైనా కూల్చేసే అవకాశం ఉందంటూ పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఇంకొందరు బాధితులు .. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ పట్టా భూముల్లోకి హైడ్రా అధికారులు దౌర్జన్యంగా చొరబడి నోటీసు కూడా ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చివేశారని తెలిపారు. హైడ్రాకు చట్టబద్ధత లేదని.. వెంటనే కూల్చివేతలను ఆపేయాలని ఆదేంచాలంటూ బాధితుల తరఫు లాయర్లు హైకోర్టును కోరారు. GHMC చేసే పని హైడ్రా చేయడం కుదరదన్నారు. అయితే చట్టప్రకారం నోటీసులు జారీ చేసే చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తరఫు ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం... 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  హైడ్రాకు సంబంధించిన జీవో 99ను సవాలు చేసిన వ్యాజ్యాలను డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ విచారణ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం కౌంటర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేస్తే తదుపరి విచారణలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. విచారణను ఈనెల 29కు హైకోర్టు వాయిదా వేసింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cherlapally Jail : చర్లపల్లి జైల్లో భారీ కుంభకోణం...ఆ డబ్బులు కూడా నొక్కేశారు

చర్లపల్లి కేంద్ర కారాగారం పారిశ్రామిక యూనిట్‌లో భారీ స్కాం జరిగినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. జైల్లో తయారైన వస్తువులను మార్కెట్‌లో విక్రయించగా వచ్చిన సొమ్మును కొంతమంది అధికారులు తమ జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.

New Update
Cherlapally Jail

Cherlapally Jail

Cherlapally Jail : చర్లపల్లి కేంద్ర కారాగారం పారిశ్రామిక యూనిట్‌లో భారీ స్కాం జరిగినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. తప్పు చేసి జైలుకు వచ్చిన ఖైదీల ప్రవర్తనలో మార్పు తెచ్చి వారు జైలు నుంచి విడుదలయిన తర్వాత తమకు నచ్చిన రంగంలో జీవోనోపాధి పొందేందుకు గాను జైలులోని పారిశ్రామిక యూనిట్‌లో శిక్షణ ఇస్తారు.సబ్బుల తయారీ, ఫినాయిల్‌ తయారీ, చేతి రుమాలు, టవళ్లు, ఇనుప వస్తువులు, ఫర్నీచర్‌, వ్యవసాయం ఇలా ఎవరికీ దేనిలో ఆసక్తి ఉంటే అందులో శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం వారితో ఆయా వస్తువులను తయారు చేసి వాటిని బయటి మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. అయితే మార్కెట్‌లో విక్రయించగా వచ్చిన సొమ్మును కొంతమంది అధికారులు తమ జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయం చాలాకాలంగా సాగుతున్నప్పటికీ ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయంపై విచారణ జరిపించాలని జైళ్లశాఖ డీజీ ఆదేశించినట్లు తెలిసింది.

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

కాగా చర్లపల్లితో పాటు రాష్ర్టవ్యాప్తంగా ఉన్న జైళ్లల్లో ఖైదీలు తయారు చేసే వస్తువులకు బయటి మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. నాణ్యత విషయంలో మిగతా వాటికి జైలు ఖైదీలు తయారు చేసే వస్తువులకు తేడా ఉంటుందని కొనుగోలు దారులు అంటున్నారు. దీంతో వారి వస్తువులకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. "మైనేషన్‌' అనే బ్రాండ్‌ నేమ్‌తో  ఖైదీలు తయారు చేసిన వస్తువులను అధికారులు బయటి మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. అలాగే చర్లపల్లి సెంట్రల్‌ జైలు పారిశ్రామిక యూనిట్‌లో ఖైదీలు తయారు చేసిన వస్తువులను కూడా  విక్రయిస్తుంటారు.అయితే గతంలో జైలు సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఓ అధికారి హయాంలో పారిశ్రామిక యూనిట్‌లో తయారైన వస్తువల విక్రయం లెక్కల్లో సుమారు రూ. 25 లక్షల మేర తేడా ఉన్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు.

Also Read: ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ
 
ఇదొక్కటే కాకుండా జైలులో నిర్వహించే క్యాంటిన్‌లో కూడా రూ.7 లక్షలకుపైగా గోల్‌మాల్‌ జరిగినట్లు తేలింది. చర్లపల్లి జైలు ఆధ్వర్యంలో కొనసాగే పెట్రోల్‌ బంకు ఆదాయంలోనూ పెద్దమొత్తంలో తేడా జరిగినట్లు తేలింది. విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్న జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా నిధుల గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరిపేందుకు ఐదుగురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.  నిధుల గోల్‌మాల్‌ విషయంలో వారం రోజుల్లోగా విచారణ జరిపి సమగ్ర నివేదిక అందజేయాలని కమిటీని ఆదేశించారు. డీజీ ఆదేశాల మేరకు బుధవారం మొదటి రోజు కమిటీ చర్లపల్లి జైలును సందర్శించి విచారణ మొదలు పెట్టింది. రికార్డుల పరిశీలించింది.

Also Read: హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు

కాగా చర్లపల్లి జైలు పారిశ్రామిక యూనిట్‌లో నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో స్టాక్‌ బుక్‌ కీలకంగా మారనుంది. యూనిట్‌లో వస్తువుల తయారీకి సంబంధించిన సమాచారం మొత్తం స్టాక్‌ బుక్‌లో నమోదు చేస్తారు. స్టాక్‌ బుక్‌లో నమోదు చేసిన వస్తువులు, బయట విక్రయం ద్వారా వచ్చిన డబ్బుల లెక్కసరిగా ఉండాలి. అయితే స్టాక్‌ బుక్‌లో నమోదు చేసిన వస్తువుల వివరాలు, ఆ సమయంలో వచ్చిన డబ్బుల డిపాజిట్‌విషయంలో భారీ తేడా ఉన్నట్లు విచారణ కమిటీ తేల్చింది. బయట విక్రయించిన వస్తువుల విషయంలో తేడాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. మరోవైపు వివిధ సందర్భాల్లో పారిశ్రామిక ప్రదర్శనల్లో ఖైదీల ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయగా అక్కడ విక్రయించిన వస్తువుల వివరాలు, అమ్మకం ద్వారా వచ్చిన నగదు విషయంలోనూ తేడాలున్నట్లు తేలింది. దీంతో డీజీ సౌమ్య మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Also Read: టిఆర్‌ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్‌లైన్‌లో యువకుల రిక్రూట్‌మెంట్!

Also Read: అఘోరీకి దిమ్మతిరిగే షాక్.. 10 ఏళ్లు జైల్లోనే - లాయర్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment