TG Cabinet Expansion: ఢిల్లీ నుంచి ఫోన్.. నాకు హోంశాఖ.. మంత్రి పదవిపై కోమటిరెడ్డి సంచలనం!

తనకు మంత్రి పదవి వస్తుందనే నమ్మకం ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. హోంమంత్రి పదవి తనకు ఇష్టమన్నారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని హైకమాండ్ ను కోరారు.

New Update

మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తనకు మంత్రి పదవి వస్తుందనే అనుకుంటున్నానన్నారు. నిన్న ఢిల్లీ లో సీరియస్ గానే కేబినెట్ విస్తరణపై చర్చ జరిగినట్లు ఉందన్నారు. అయితే తనకు ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి ఫోన్ రాలేదన్నారు. కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని హైకమాండ్ ను కోరారు. భువనగిరి ఎంపీ ఎన్నికల భాధ్యతలు ఇస్తే సమర్దవంతంగా నిర్వహించానని గుర్తు చేశారు. హోంమంత్రి పదవి తనకు ఇష్టమన్నారు. ఏ పదవి వచ్చినా సమర్దవంతంగా నిర్వహిస్తానని.. ప్రజల పక్షాన నిలబడతానని అన్నారు. 
ఇది కూడా చదవండి: EX Sarpanch: సూర్యాపేట మాజీ సర్పంచ్ ను చంపింది అల్లుళ్లే.. కూతుళ్లు కూడా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

తెలంగాణలో కేబినెట్ విస్తరణపై హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో కీలక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు నిన్న ఢిల్లీకి వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మంత్రి వర్గ విస్తరణపై వీరు ప్రధానంగా హైకమాండ్ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం సాగుతోంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కూడా కేబినెట్లో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Mallareddy: మల్లారెడ్డికి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. భారీగా నిధులు మంజూరు!

ఆ ఇద్దరు ఔట్?

అయితే.. కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి తప్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూపల్లి కృష్ణారావు స్థానంలో.. అదే వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావును తీసుకుంటారని సమాచారం. విజయశాంతి పేరును కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు గాంధీభవన్ లో చర్చ సాగుతోంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు కూడా కేబినెట్ బెర్త్ ఖరారైనట్లు తెలుస్తోంది. మరో ఒకటి లేదా రెండ్రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment