ఫ్యామిలీతో వెళ్లి మోదీని కలిసిన రఘునందన్.. బీజేపీ అధ్యక్ష పదవి ఫిక్స్?

మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రోజు ప్రధాని మోదీని కుటుంబ సభ్యులతో కలిశారు. మనవడు, మనవరాళ్లు, కూతురు, అల్లుడితో కలిసి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో బీజేపీకి కొత్త చీఫ్‌ రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ చర్చనియాంశమైంది. 

New Update
BJP MP Raghunandan Rao

BJP MP Raghunandan Rao

మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రోజు ప్రధాని మోదీని కుటుంబ సభ్యులతో కలిశారు. మనవడు, మనవరాళ్లు, కూతురు, అల్లుడితో కలిసి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో బీజేపీకి కొత్త చీఫ్‌ రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ చర్చనియాంశమైంది. రఘునందన్ రావుకు అధ్యక్ష పదవి రాబోతోందని పార్టీ నుంచి సమాచారం వచ్చిందా? ఈ నేపథ్యంలోనే మోదీని మర్యాదపూర్వకంగా కలిశారా? అన్న అంశంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
ఇది కూడా చదవండి: Phone Tapping Case : హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ ఎవరు అవుతారు? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. రఘునందన్ రావు, ఈటల రాజేందర్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్న ప్రచారం సాగుతోంది. అయితే బీసీ నేపథ్యంలో ఈటలకు ఎక్కువ ఛాన్స్ ఉందని కొన్ని రోజులు గా వార్తలు వినిపించాయి.
ఇది కూడా చదవండి: Pareshan Boys Imran: బెట్టింగ్ యాప్స్ కేసు.. అడ్డంగా దొరికిపోయిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్!

ఇటీవల ప్రధానికి కలిసిన ఈటల ఫ్యామిలీ..

ఈటల రాజేందర్ సైతం ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. దీంతో ఒకటి రెండ్రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని.. అందుకు ఈటల ప్రధానిని కలిశారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ప్రకటన ఇంత వరకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సైతం కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీనిని కలవడం చర్చనీయాంశమైంది. 

#telugu-news #latest-news #raghunandan rao
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ....

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment