BIG BREAKING: రాజకీయాలకు గుడ్ బై.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన

ఇకపై చిల్లర రాజకీయం చేయనని.. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.

New Update
Raja singh Murder sketch

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇక పై చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానన్నారు. చిల్లర రాజకీయం నుంచి దూరంగా వెళ్లి ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలనదే తన లక్ష్యం అన్నారు. ఈ రోజు బీజేపీ కీలక నేత లక్ష్మణ్ సమక్షంలో రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ కు చెందని కీలక నేత అలా పురుషోత్తం బీజేపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో రాజా సింగ్ కి టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీని వీడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

పార్టీకి పంటి కింద రాయిలా మారిన రాజాసింగ్..

అయితే.. గత కొన్ని రోజులుగా పార్టీకి పంటి కింద రాయిలా మారిన రాజాసింగ్ కు చెక్ పెట్టాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పురుషోత్తంను చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కేవలం రాజాసింగ్ మాత్రమే విజయం సాధించారు. అనంతరం 2023 ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. గెలిచిన వారంతా తనకు జూనియర్లే కావడంతో తనకు శాసనసభాపక్ష నేత పదవి ఖాయమని రాజాసింగ్ భావించారు. కానీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డికి ఆ పదవిని అప్పగించింది హైకమాండ్. దీంతో అప్పటి నుంచి రాజాసింగ్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కూడా దూరం..

పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఆయన పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. హైదరాబాద్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగిన మాధవీలత ప్రచారంలో ఆయన పాల్గొనకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరం పార్టీ చేపట్టే ఏ కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించడం లేదు. ఇటీవల పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమానికి సైతం దూరంగా ఉన్నారు. దీంతో ఆయనను పక్కకు పెట్టే పనిలో బీజేపీ నాయకత్వం నిమగ్నమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానని.. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని వ్యాఖ్యలు చేశారన్న చర్చ సాగుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment